గ్రేటర్ యుద్ధం : అసలు కథ మొదలైంది.. డబ్బులు పంచుతున్నారు..?

praveen
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నిన్నటి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులందరూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు అనే విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్న దానిపై ఎన్నో హామీల వర్షం కురిపించారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది అన్న విషయం తెలిసిందే.  జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకొని మరోసారి విజయ ఢంకా మోగించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దుబ్బాక లో మాదిరిగానే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా మంచి విజయాన్ని సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుని  టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని అటు బిజెపి కూడా ప్రయత్నాలు చేసింది.

 ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు అన్ని డివిజన్లలో కూడా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక నిన్న జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా వాతావరణం హాట్హాట్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఓటర్లకు డబ్బులు పంచి  ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ప్రస్తుతం ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.  అంతేకాకుండా ఆయా పార్టీల అభ్యర్థులు కూడా.. తమ ప్రత్యర్ధులు ఓటర్లను ప్రలోభాలకు చేసేందుకు డబ్బులు పంచె ఆస్కారం ఉన్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేశారు.

 ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా డబ్బులు పంచుతున్న అధికార పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గుడిమల్కాపూర్ మైలార్ దేవ్ పల్లి అడిక్మెట్ మన్సూరాబాద్ లో డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు బండి సంజయ్. ఎన్నికల కమిషన్ పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుంటే గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: