ఏపీలో మరో కార్యక్రమం... జగనన్న షవర్ బాత్

Gullapally Rajesh
ఏపీలో టీడీపీ నేతలు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న నేతలు కూడా బయటకు వచ్చి విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలపడే క్రమంలో కాస్త దూకుడు వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సిఎం జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. తుంగభద్ర పుష్కరాలను కూడా ఆర్గనైజ్ చేయలేని   ఒక దద్దమ్మ అని ఆమె మండిపడ్డారు. పుణ్య స్నానాలు ఆచరించిన వారిని, అరెస్టు చేస్తున్నారు.. దారుణం అని ఆమె విమర్శించారు.
పుష్కరాలకు జగనన్న షవర్ బాత్ కార్యక్రమం పెట్టారని ఆమె విమర్శలు చేసారు. రోడ్ల పరిస్థితి చూస్తే పుష్కరాలకు వెళ్ళిన వారు తిరిగి వస్తారు లేదా అనుమానంగా ఉంది అని అన్నారు. హిందూ ధర్మం మీద వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి అవగాహన లేదు.. భక్తి భావన లేదు అని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నంలో కి  వైసిపి నేతలు వలస కార్మికులు గా వచ్చి విశాఖ మీద పడి బతుకుతున్నారు అని విమర్శించారు. విజయసాయి రెడ్డి విశాఖ ఎయిర్పోర్టు ధనవంతులు కి పార్కింగ్ ప్లేస్ గా మార్చే అందుకే ఈ లేఖ రాశారు అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారికి , శుక్రవారం కలిసి వస్తుందని తెలుసు కానీ,   విశాఖపట్నంలో కూడా  కూల్చివేతలు శుక్రవారం పూట మొదలుపెడతారు అనుకోలేదు అని ఆమె వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి నేతలు , చవటలు దద్దమ్మలు అంటూ విమర్శిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. అదే పార్టీ గుర్తు మీద రెండు సార్లు మిమ్మల్ని  గెలిపించారని విషయం మర్చిపోకండి అని ఆమె వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవండి అని ఆమె సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: