ఫ్లాష్ బ్యాక్ : హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ను మార్చమంటూ కేంద్ర హోంశాఖకు సీఎం ఫిర్యాదు..!?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని.. ఆయన ప్రభావంతో కొందరు న్యాయమూర్తులు తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇది చరిత్రలోనే ప్రథమం అనీ.. ఇలాంటి విడ్డూరం ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యతిరేక పత్రికలు వార్తల దాడి మొదలు పెట్టాయి. అసలు సీఎం లేఖ రాసిన విషయాన్ని బయటపెడుతూ ఏపీ సీఎం ముఖ్య సలహాదారు పెట్టిన ప్రెస్ మీట్ ను వార్తగానే రాయని సదరు పత్రికలు.. ఆయన వ్యతిరేక వార్తలు మాత్రం ఎక్కడెక్కడ జరిగినా వెతికి మరీ పట్టుకొచ్చి ప్రయారిటీ ఇచ్చి ప్రచురిస్తున్నాయి.

అయితే ఇదంతా పాఠకులకు అలవాటైన వ్యవహారమే. అయితే.. ఇలాంటి సమయంలో కొందరు ఆసక్తి ఉన్న జర్నలిస్టులు.. కాస్త ఫ్లాష్ బ్యాక్ తవ్వితీసి అసలు వాస్తవాలు జనం ముందు ఉంచుతున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఇలా న్యాయమూర్తుల మీద ఫిర్యాదు చేసిన సీఎంలలో జగనే మొదటి వాడు కాదట. గతంలో 1960లో ముఖ్యమంత్రిగా ఉన్న దామోదరం సంజీవయ్య అప్పట్లో కొందరు జడ్జిలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారట. అవినీతి పరులు అయిన న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారట.

సదరు న్యాయమూర్తులు అవినీతిపరుల కోసం పని చేస్తున్నారు అని... ఆనాటి ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను మార్చాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య  కేంద్ర హోమ్ శాఖ కి ఉత్తరం రాశారట. అంతే కాదు.. ఆనాటి  హోమ్ మంత్రి శాస్త్రి గారితో స్వయంగా చర్చించా అని కూడా అదే ఉత్తరం లో రాశారట. ఇందుకు సంబంధించిన లెటర్ కాపీ కూడా జత చేస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. కొన్ని వాస్తవాలు ఇలా ఉంటే.. అసలు న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేయడమే మహా ద్రోహం పాపం.. అన్నట్టు కొన్ని పత్రికలు ప్రచారం మొదలుపెట్టాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: