మొన్న ప్రయోగం.. నేడు మోహరింపు.. మోడీ ప్లాన్ అదిరింది..?
ఇటీవలే భారత్లో తయారు చేసిన కొన్ని స్వదేశీ ఆయుధాలు విజయవంతమైన విషయం తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ తో డి ఆర్ డి ఓ తయారు చేసిన ఆయుధాలు ప్రస్తుతం భారత అమ్ములపొది లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమం లోనే ఆయుధాల ప్రయోగాలు చేయడం తో పాటు శరవేగంగా భారత ఆర్మీ లోకి ఆయుధాలను చేరుస్తుంది భారత్. ఇటీవలే పరీక్షల్లో విజయవంతం అయిన.. సౌర్య మిస్సైల్ ను సరిహద్దుల్లో మొహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వరుసగా సరికొత్త ప్రయోగాలు నిర్వహించడం తో పాటు ఈ ప్రయోగాల్లో విజయవంతం అవుతున్న సరికొత్త టెక్నాలజీతో కూడిన ఆయుధాలు నిర్భయ్, సౌర్య, స్మార్ట్ ఇలాంటి ఆయుధాల ను సరిహద్దుల్లో మోహరిస్తోంది భారత ప్రభుత్వం. అయితే ప్రస్తుత సరిహద్దుల వెనక్కి తగ్గినట్టు నాటకం ఆడుతున్న చైనా ఏ క్షణంలోనైనా భారత్పై దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన మిస్సైల్స్ మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేవలం ఆత్మ రక్షణ కోసమే అన్న సమాచారాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తూనే ఉంది భారత్.