భారత్‌తో యుద్ధం: వాళ్లను తలచుకుని వణికిపోతున్న చైనా..?

Chakravarthi Kalyan
భారత్ చైనా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒక్క లద్దాఖ్ అనే కాకుండా సరిహద్దు అంతటా సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది చైనా.. అటు కాశ్మీర్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకూ సరిహద్దుల్లో చైనా కదలికలు బాగా పెరిగాయి. దీనికి తోడు.. మాతో యుద్ధం చేస్తే మీ మిలిటరీని మూసుకోవాల్సిందే అంటూ తన బాకా పత్రికల్లో ఆర్టికల్స్ రాయిస్తూ రెచ్చగొడుతోంది డ్రాగన్ దేశం..

ఈ నేపథ్యంలో ఇండియా కూడా సరిహద్దుల్లో సిద్ధంగానే ఉంది. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సైన్యం రెడీ అంటోంది. ఈ సీన్‌లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చైనా.. ఒక్క విషయంలో మాత్రం భారత్‌ను తలచుకుని వణికిపోతుందని సైన్యానికి చెందిన మాజీ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరి చైనాను వణికిస్తున్న ఆ అంశం ఏంటో చూద్దామా..


భారత సైన్యంలో ఓ ప్రత్యేకమైన దళం ఉంది. వాస్తవానికి వీరు సైన్యంలోనే ఉండరు. కానీ శత్రువులకు దడ పుట్టిస్తారు. వీటిని స్పెషల్ ఫ్రాంటియర్స్‌ దళాలు అంటారు. 1962 చైనాతో యుద్ధం అనంతరం స్పెషల్‌ ఫ్రాంటియర్‌ దళాలను ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే .. అసలు ఈ దశాల్లో ఉండేది భారతీయులే కాదు.. నిజంగా షాకింగ్ కదా.. అసలు కథ ఏంటంటే.. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న అనంతరం వేలాదిమంది టిబెటన్లు భారత్‌లోకి శరణార్ధులుగా వచ్చారు. వీరిలో కొంతమందితో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ దళంలో టిబెటన్లు, గూర్ఖాలు మాత్రమే ఉంటారు. ఈ దళం  నేరుగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకే పని చేస్తుంది.

ఈ దళం ప్రత్యేకత ఏంటంటే.. వీరు స్థానికులు కావడంతో పర్వతప్రాంతాల్లో ఎలాంటి ఆపరేషన్లనయినా సులువుగా నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే 1962లో మేజర్‌ జనరల్‌ సుజాన్‌సింగ్‌ ఉబన్‌ ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి పర్వతప్రాంతాలు, లోయలు బాగా పరిచయం అందుకే.. వీరిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అందుకే చైనా దళాలు ఇప్పుడు వీరిని తలచుకున వణికిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: