ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. ఛీ ఛీ ఈ నీచున్ని ఉరి తీయాల్సిందే..?
తాజాగా నిర్భయా ఘటనను తలపించే మరో ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. కరీం ఏరియాలో ఓ మరాఠి ఫ్యామిలీ నివసిస్తోంది. అదే ప్రాంతంలో సుధామ అనే వ్యక్తి తన కుటుంబం తో నివసిస్తున్నాడు. రిక్షా తోలుతు జీవనం సాగిస్తున్నాడు సుధామ . సుధామాకి లేని చెడు అలవాటు అంటూ లేదు... రాత్రి అయ్యిందంటే మద్యం ఉండాల్సిందే . ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు రాత్రి సమయంలో ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపై తూలుతూ వెళుతున్నాడు. కరోనా దృశ్య రోడ్డు మీద ఎవరూ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్నా ఇంటి వరండాలో ఓ వృద్ధురాలు పక్కనే ఎనిమిదేళ్ల చిన్నారి నిద్రిస్తున్నట్లు గా కనిపించింది.
ఆ చిన్నారి పై కన్నేసిన సుధామ కామం తో ఊగిపోయాడు. చిన్నారి నోరుని అదిమి పట్టుకుని తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఇక తన ఇంట్లో అందరూ పొరుగూరు వెళ్లడంతో రాత్రంతా చిత్రహింసలకు గురిచేస్తూ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పొద్దున్న లేచేసరికి పక్కన మనవరాలు లేకపోవడంతో టెన్షన్ పడిన వృద్ధురాలు... ఇంట్లోని కుటుంబ సభ్యులను లేపింది. ఇక వారందరూ వెతుకుతున్న సమయంలో కొంత దూరంలో ఆ చిన్నారి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా తీవ్ర రక్తస్రావం అవుతోంది. హాస్పిటల్ కి తరలించగా చిన్నారరిని పరీక్షించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ చిన్నారి ఏం జరిగిందో చెబుతున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఇలాంటి నీచులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు..Powered by Froala Editor