పది పాసైన వారికీ కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్..?

praveen

దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి  చెందుతున్న కరోనా వైరస్ ప్రభావం  విద్యారంగంపై ఎక్కువగా పడిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే సరిగ్గా 10వ తరగతి పరీక్షలు నిర్వహించే సమయానికి కరోనా విజృంభించడంతో.. పది పరీక్షలు నిర్వహించాలా  వద్దా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు తర్జనభర్జన పడ్డారు.ఈ క్రమంలో  దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న దృశ్య పది పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

 ఈ నేపథ్యంలో ఎంతో విద్యార్థులకుమేలు  జరిగింది అనే చెప్పాలి. అందరూ విద్యార్థులు పాస్ అయ్యారు. అందరు విద్యార్థులను పాస్ చేస్తూ ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడ్లను కేటాయించింది తెలంగాణా సర్కార్. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరికీ ఇప్పటికే షార్ట్ మెమోలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక 10వ తరగతి పాసైన విద్యార్థులు అందరికీ ఒరిజినల్ మెమోలను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చర్యలు  జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మెమోల  పంపిణీకి ముందు ఈ మెమో లో పేరు పుట్టిన తేదీ వివరాలు సరిగా ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవడానికి ప్రస్తుతం అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. 


 మెమో లో ఉన్న అక్షర దోషాలను సరిదిద్దుకోవడానికి మరో వారం రోజులపాటు తెలంగాణ విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇక ఇలా అక్షరదోషాలు సరిదిద్దుకోవడం పూర్తయిన వెంటనే... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ల వారిగా మెమోలు జారీ ప్రక్రియ ఉంటుందని తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పరీక్ష రద్దు నిర్ణయం ద్వారా... పరిక్షలు జరిగితే పాస్ కాలేము  అనుకున్న విద్యార్థులు కూడా ప్రస్తుతం పాస్ అయిన విషయం తెలిసిందే. ఇక రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం కోసం కూడా తెలంగాణ సర్కార్ ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: