గుడ్ న్యూస్: టీవీ కొనుగోలపై SBI అదిరిపోయే ఆఫర్లు..!
దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసందే. దేశంలో కరోనాను కొంత మేరకు అయినా అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. అయితే కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. దేశంలో లాక్ డౌన్ సండలింపు చేయడంతో దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ దుకాణాలు తెర్చుకున్నప్పటికీ కొనుగోలుదారులు ఎవ్వరు ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు.
టీవీ కొనాలి అనుకునే వారి కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే మంచి టీవీని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత తగ్గింపు పొందొచ్చునని నిపుణులు అంటున్నారు.
అయితే ఫ్లిప్కార్ట్ మాన్సూన్ అప్లయెన్సెస్ ధమాకా పేరుతో టీవీలపై అదిరే ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఆఫర్లో భాగంగా వీయూ 32 అంగుళాల టీవీని కేవలం రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.14,000గా ఉంది.
వీయూ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్ఈడీ టీవీలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఇంకా ఈ టీవీలో 1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్, 20 వాట్ సౌండ్ ఔట్పుట్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్లో టీవీకి కస్టమర్ల రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంది.
అయితే వీయూ టీవీని ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 3 నెలల కాల పరిమితితో టీవీ కొంటే ఈఎంఐ రూ.2729గా ఉంది. 6 నెలలకు అయితే నెలకు రూ.1389 చెల్లించాలి. అదే 9 నెలలకు అయితే రూ.942 కట్టాలి. ఇక 12 నెలలకు అయితే నెలకు రూ.719 చెల్లిస్తే సరిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.