లాక్ డౌన్ దిశగా భారత దేశంలోని పలు రాష్ట్రాలు.. !
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రం , ఆ రాష్ట్రమని తేడా లేదు. అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. కొత్త కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో మళ్లీ లాక్డౌన్పై దృష్టిపెట్టాయి ప్రభుత్వాలు.
కరోనా కేసులను కంట్రోల్ చేయాలంటే...లాక్డౌన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్నాయి రాష్ట్రాలు. లాక్డౌన్ ఎగ్జిట్ను గందరగోళంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ... మళ్లీ లాక్డౌన్ అమలుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. మణిపూర్, అసోంలో లాక్డౌన్ను ప్రకటించారు. ఆదివారం నుంచి రెండువారాల పాటు కఠిన లాక్డౌన్ను అమలు చేయనున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ కొనసాగనుంది. నిత్యవసరాలకు ముందే కొనుగోలు చేసుకోవాలని అసోం ప్రభుత్వం ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలు, {{RelevantDataTitle}}