సీమ పౌరుషాన్న కించపరచొద్దు అఖిలా..
ఆళ్లగడ్డ పౌరుషానికో ప్రత్యేకత..
రాయలసీమలో ఆళ్లగడ్డ పౌరుషానికో ప్రత్యేకత ఉందని, విశ్వసనీయత వీడిన రాజాకీయాలు నీవు చేసుకుంటే చేసుకో, కానీ రాయసీమ ఆత్మగౌరవాన్ని ఆళ్లగడ్డ' పౌరుషాన్ని కేవలం ఆలుగడ్డ పప్పు లాంటి లోకేష్ కోసం తాకట్టు పెట్టవద్దని అఖిల ప్రియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">భూమా అఖిల ప్రియా రెడ్డికి వైసీపీ నేత శైలజారెడ్డి హితవు పలికారు. లోకేష్ అరెస్ట్ విషయంలో ఆఖిల ప్రియ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీబాగ్ ఒప్పందం ఇంకా రాయలసీమ వాసుల చిరకాల కొరిక అయిన హైకోర్టు మాకొద్దు అని చెప్పటానికేమైనా రాయలసీమ గుత్తేదారా అని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసే అఖిలప్రియకు ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అమరావతి ఐఫోన్' రైతుల కొసం పడే ఆరాటంలో పదో వంతైనా తన నియోజకవర్గ ప్రజలపై చూపించివుంటే ఓడిపోయే వారు కాదన్నారు. ధర్నా సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఈ తర్వాత వదిలేయడం పోలీసు విధుల్లో భాగమీ కదా అని శైలజ అన్నారు. అయితే మీ లోకేష్ కి ఒక నాయకునిగా సదరు పోరాటానికి సారధ్యం వహించి అరెస్ట్ అయ్యే అర్హత కూడా లేదని మీ అభిప్రాయమా అని వ్యాఖ్యానం చేశారు.
పనికిమాలిన వ్యాఖ్యలు తగదు..
అమరావతి రైతుల కోసం రాయలసీమ నుంచి తరలి వస్తామన్న అఖిలప్రియ వాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. ఇకపై ఇటువంటి పనికిమాలిన కామెంట్లతో రాయలసీమ ప్రజలను ఆవహేళన చేసి వారు తలదించుకునేలా, సిగ్గుపడేలా చేయవద్దని భూమాకి హితవు పలికారు. జగనన్న ఒక దూర దృష్టి తో చేస్తున్న సమగ్ర, సమాన అభివృద్ధి ప్రణాలికలో యావత్ ప్రజానీకం భాగస్వాములైతేనే అన్నిప్రాంతాలు బాగుంటాయన్నారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు పరిస్థితి ఓ గల్లీ లీడర్ కంటే అద్వాన్నంగా తయారైందని, తిరుణాల్లలో మొగుడు పెళ్లాల పంచాయతీలు చేసుకుంటూ మైకులో చందాలు వసూలు చేకుకునే దీన స్థితిలో ఉన్న బాబుకి లోకేష్ శాపమని తెలిసినా చంద్రన్న భజన కోసమే లోకేష్'ను అఖిల సమర్దిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో మరింత దిగజారి సీమ పౌరుషాన్ని కించపరచొద్దు అని శైలజారెడ్డి హితవు పలికారు