రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్పై వైఎస్సార్సీపీ వీడియో ప్రజెంటేషన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనేశ్వరి రాజధానిపై ఎందుకంత జాలి చూపిస్తున్నారని ప్రశ్నించారు. ‘గిట్టుబాటు ధర లేక రైతులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయారు. భువనేశ్వరికి అప్పుడు ఎందుకు రైతుల మీద ప్రేమ కలగలేదు. 30 మంది చంద్రబాబు ప్రచార పిచ్చి వలన పుష్కరాల షూటింగ్లో చనిపోయారు.అంతేకాదు భువనేశ్వరికి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు... ఎన్టీఆర్ ఊరు ఊరు తిరుగుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ఎందుకు జాలి కలగలేదు. రైతుల ప్రేమా లేదంటే బినామీ భూములు మీద ప్రేమా. ఎంతో మంది సమైక్యాంధ్ర కోసం చనిపోయారు. అప్పుడు ప్రేమ ఎందుకు కలగలేదు. తన కుమారుడు బినామీల పేరుతో కొన్న భూముల కోసం విరాళం ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు. రాజధాని రైతులు ‘చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలి.
ఆయన కారుణ్య మరణాలు అంటున్నారు. హత్యలు చేసి రాజధాని కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నమ్మిస్తారు. చంద్రబాబు ఎంత నీచనికైనా తెగిస్తారు. జాగ్రత్త’ అని ప్రజలను అప్రమత్తం చేశారు.‘చంద్రబాబు జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. చంద్రబాబు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చంద్రబాబు మాట తప్పారు. రాజధాని ఇక్కడ నుంచి తరలిపోలేదు. మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. బినామీ రైతులకు, బ్రోకర్స్కు ప్రభుత్వం న్యాయం చేయలేదు. నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాల ప్రజలకు లబ్ది చేకూరుస్తారు. గతంలో హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్ అందువల్లే నష్టపోయింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసారు అని చంద్రబాబు తీరును అంబటి ఎండగట్టారు.
‘ దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగితే చంద్రబాబు ఒక కేజీ అయిన రైతులకు హెరిటేజ్ నుంచి ఇచ్చారా. చంద్రబాబు అంత తొందర పడితే ఎలా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇన్సైడర్ ట్రేడింగ్పై ఇంకా విచారణ జరుగుంది. ఎంతటి పెద్ద వారైనా శిక్ష తప్పదు. పవన్ కల్యాణ్ ఊరేగిoపుగా వెళ్తే ముళ్ల కంచె వేయరా. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లింగమనేనికి ఎలాంటి సంబంధం ఉందో అందరికి తెలుసు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. పవన్ రోజుకొక మాట మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.