చిరంజీవిని అవమానించిన వారితో పవన్ కల్యాణ్ దోస్తీ..?

Chakravarthi Kalyan

జనసేన పవన్ కల్యాణ్ సొంత అన్నయ్య చిరంజీవిని అవమానించిన వారితో దోస్తీ చేస్తున్నారు. అన్నయ్య కారణంగానే .. అన్నయ్య బ్రాండ్ ఇమేజ్ తోనే సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు కన్వీనియంట్ గా అన్నయ్య బ్రాండ్ చెరిపేసుకుంటున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.


గతంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడారు. అప్పట్లో అది సంచలనం అయ్యింది. తాజాగా పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సభకు ముఖ్య అతిథిలుగా టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు వచ్చారు. మరి చిరంజీవిని గతంలో అవమానించిన వ్యక్తితో కలసి చిరంజీవి ఎలా వేదిక పంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.


పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కన్నబాబు.. ఈవిషయాలపై పవన్ తీరును ఎండగట్టారు. తూర్పుగోదావరి జిల్లా కరపకు పోలింగ్‌కు మూడ్రోజుల ముందు వచ్చి అరగంట నన్ను తిట్టాడని గుర్తు చేసుకున్నారు. తనను తరిమికొట్టమని ప్రజలకు పిలుపునిచ్చాడని... కానీ రెండు చోట్ల నిలబడిన పవన్‌ను ప్రజలు తరిమికొట్టారని కన్నబాబు అన్నారు.


అయ్యన్నపాత్రుడి కుమారుడు చిరంజీవి గురించి అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియో పవన్‌ విన్నారా..? లేదా మమ్మల్ని పంపించమంటారా..? అలాంటి వారినే పక్కనబెట్టుకొని పవన్‌ మాట్లాడాడు. నీ బతుకు గురించి తెలుసు అని మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే జ్ఞానం పవన్‌కు ఉండాలి. ఇవాల్టికి చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటా.. కానీ పవన్‌ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి పేరు ఎప్పుడైనా చెప్పాడా..? కానిస్టేబుల్‌ కొడుకుని, పోస్టుమెన్‌ మనవడిని అని కొత్త బ్రాండింగ్‌ చేసుకునే ఆలోచన.


ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు.. ఆయన ఏం చదివాడు.. నువ్వు ఏం చదివావు పవన్‌. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు’. పవన్‌ కల్యాణ్‌ అవగాహన పెంచుకొని మాట్లాడాలని మంత్రి కన్నబాబు చురకలు అంటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: