తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె. చంద్రశేఖర రావు గార్కి మా సవినయ విన్నపం, అభ్యర్థన.
అయ్యా!
దేవాదాయశాఖ మాదిరి, దర్గాదాయశాఖ, చర్చాదాయశాఖ లు ఏర్పాటు చేసి ఆ వచ్చిన ఆదాయం తో వారి వారి దర్గాలు, చర్చీలు అభివృద్ధి చేయగలరు.
ఎవరి ఆదాయం వారికి హ్యాపీగా ఖర్చులు చేయగలరు.
కేవలం ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే దేవాదాయ శాఖ ఉండటం ఏమాత్రం బాగాలేదు. అందరికీ సమానంగా శాఖలు ఉంటే బాగుంటుంది.
దేవాదయా శాఖలో ఉన్న ఇతర మతస్తులు ఎంతో బాధలు పడుతున్నారు. వారికి మోక్షం ప్రసాదించి వారిని వారి వారికి సంబంధించిన శాఖలకు ట్రాన్స్ఫర్ చేసి పుణ్యం కట్టుకొన గలరని తమరిని సవినయంగా వేడుకుంటున్నాము.
దర్గాదాయశాఖ, చర్చాదాయశాఖలు ఏర్పాటు చేస్తే ఎంతోమంది కి చైర్మన్ and మెంబెర్స్ గా పొలిటికల్ placements కూడా ఇవ్వవచ్చు.. నిరుద్యోగ సమస్య కూడా కొద్దిగా తీరుతుంది..
దర్గాదాయశాఖ, చర్చాదాయశాఖ పెడితే ఫండ్స్ దుర్వినియోగం కాకుండా Government కాపాడవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వారు దేవాదాయ శాఖ ద్వారా కేవలం హిందూ దేవాలయాల ఫండ్ మాత్రమే కాపాడటం జరుగుతోంది. ఇది పక్షపాతం అవుతుంది. అందుకే సమన్యాయం గా దర్గాదాయశాఖ, చర్చాదాయశాఖ లు ఏర్పాటు చేస్తే ఎవరికి సంబంధించిన ఫండ్ వారి వారికి వినియోగించవచ్చు.
దయచేసి వెంటనే దర్గాదాయశాఖ, చర్చాదాయశాఖ లు ఏర్పాటు చేయవలసిందిగాసవినయంగా కోరుకుంటున్నాము.