జేసి భజన అందుకేనా... టీడీపీ లో విలువ లేకుండా పోయిందా...!

Prathap Kaluva

జేసి దివాకర్ రెడ్డి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడు. అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈయన గారికి పార్టీ మీద జిల్లా రాజకీయాల మీద ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చూస్తుంటే టీడీపీ లో అస్సలు బొత్తిగా ఇతనికి విలువ ఇవ్వనట్లు కనిపిస్తుంది. అందుకే చంద్ర బాబు కు మరియు లోకేష్ కు డబ్బా కొట్టే పరిస్థితి కి వచ్చాడని అర్ధమవుతుంది. 


తెలుగుదేశం పార్టీ వారు జేసీ గురించి పైకి సానుకూలంగా మాట్లాడుతున్నా.. లోపల మాత్రం జేసీ మాటను జరగనివ్వడంలేదు. కొందరు అయితే బహిరంగంగానే జేసీతో ఢీ కొడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో పడరానిపాట్లు పడుతున్నాడు జేసీ. ఆఖరికి లోకేష్‌బాబు భజన చేయాల్సిన స్థాయికి దిగజారిపోయాడు. అడ్డగోలుగా చంద్రబాబు కోసం డప్పు కొడుతున్నాడు.


రాజకీయాల్లో ఏనాడో ఒక గ్రూపు మెయింటెయిన్‌ చేసిన దివాకర్‌ రెడ్డి ఇప్పుడు చినబాబు లోకేష్‌ భజన చేస్తూ ఉండటమే కామెడీ ఇక్కడ. 90లలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన జేసీ.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్‌ భజన చేస్తున్నాడు. లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలి.. చంద్రబాబు ప్రధాని కావాలని అంటూ భజన పరుడిగా కొత్త డిగ్రీని సంపాదించాడు జేసీ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: