తెలంగాణ : కార్పొరేట్ కాలేజీలపై సర్కార్ సీరియస్ ?
ఇక తెలంగాణాలోని రంగా రెడ్ట్ జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సాత్విక్ నార్సింగ్లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం రీసెంట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈ విషాద ఘటనతో రాష్ట్ర విద్యా శాఖ దెబ్బకి అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కాలేజీలను కంట్రోల్ చేసేందుకు పలు కఠిన చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే సోమవారం నాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో అధికారులు భేటీ అవ్వడం జరిగింది.అయితే నిజానికి ఈ భేటీకి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండగా చివరి క్షణంలో మంత్రి ఈ భేటీకి హాజరుకాలేకపోయారు.ఇక ఇదిలా ఉంటే ఈ సమావేశం తర్వాత అధికారులు పలు కీలక నిర్ణయాలని తీసుకోవడం జరిగింది.
సాత్విక్ ఘటన జరిగిన నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీ వచ్చే అకాడమిక్ ఇయర్కి దాన్ని రద్దు చేశారు.ఇంకా అదే విధంగా కార్పొరేట్ కాలేజీల ప్రచారాలపై కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులను ఆకర్షించేలా ఇచ్చే ప్రకటనలపై నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నారు.దండించే, దూషించే లెక్చరర్లు ఎక్కడా పని చేయకుండా నిషేదం విధించేలా పలు చర్యలని తీసుకోనున్నారు.ఇక ఇదిలా ఉంటే సాత్విక్ ఘటనపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇంటర్ బోర్డుకు తమ క్షమాపణ చెప్పింది. ఈ విషాద ఘటనపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ స్పందిస్తూ.. క్షమాపణ చిన్నపదమని బాగా మండిపడ్డారు. ఈ సంరద్భంగా కార్పొరేట్ కాలేజీలపై నవీన్ మిట్టల్ చాలా తీవ్రంగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమావేశంలో ప్రైవుటు విద్యా సంస్థలు చైర్మన్లు తమ అభిప్రాయాలను కూడా పంచుకోవడం జరిగింది.