సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంత్రి విడదల రజినీ?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న  డైనమిక్‌ పొలిటికల్‌ లీడర్‌ విడదల రజినీ గురించి గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు.ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై తనదైన స్టైల్ లో పంచుల వర్షం కురిపిస్తుంటుంది. అటు ఏపీ ప్రభుత్వంలోనూ ఇంకా ఇటు వైసీపీ పార్టీలోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఏంటంటే.. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని నెట్టింటా గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. సినిమా నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు రజిని ప్రయత్నాలు ప్రారంభించారని అందుకు ఒక బ్యానర్‌ను కూడా మొదలెట్టే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ఆఫీసుని కూడా ఆమె రెడీ చేస్తున్నట్లు కొన్ని రూమర్లు వస్తున్నాయి.


టాలీవుడ్ లో నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం అంతా రెడీ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.త్వరలోనే డైరెక్టర్‌, హీరో, హీరోయిన్లు ఇంకా అలాగే ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్‌ చేసి అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంత్రి విడదల రజినీ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు కేవలం ఒట్టి పుకార్లేనని స్పష్టమైంది. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది. ఇక చిలకలూరి పేట టౌన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు విడదల రజిని. 2014 వ సంవత్సరంలో తెలుగు దేశం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రజినీ. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జగన్‌ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరారు.2019 వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణలో భాగంగా వైద్య ఇంకా ఆరోగ్య శాఖా మంత్రిగా కూడా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: