అమరావతి : చంద్రబాబు భవిష్యత్తు తేల్చేసిన దగ్గరి బందువు

Vijaya






చంద్రబాబునాయుడు, లోకేష్ భవిష్యత్తును వాళ్ళ దగ్గరి బంధువు దగ్గుబాటి పురందేశ్వరి తేల్చేశారా ? ఒంగోలులో జరిగిన పార్టీకార్యక్రమంలో మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవదని చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం మీద జనాలకు నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు-పురందేశ్వరి మధ్య ఉన్న బందుత్వం ఏమిటి ? వాళ్ళు ఎంత దగ్గరి బంధువులన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒకవైపు చంద్రబాబు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.



ఇదేసమయంలో చంద్రబాబును ఎంతవీలైతే అంత దూరంగా బీజేపీ ఉంచుతోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తుపై పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బాదుడేబాదుడు కార్యక్రమం, ఇదేం ఖర్మ..రాష్ట్రానికి అనే కార్యక్రమాల్లో చంద్రబాబు బాగా బిజీగా రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మీద జనాలకు నమ్మకంపోయిందని బీజేపీ సీనియర్ నేత  పురందేశ్వరి చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది.



టీడీపీ వ్యవహారాలపైన, రాజకీయంగా తెలుగుదేశంపార్టీ ప్రస్తుత పరిస్ధితి మీద బీజేపీ నేత బాగా స్టడీ చేసినట్లే ఉన్నారు. స్టడీ చేయించకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదని చంద్రబాబు, లోకేష్ ను జనాలు నమ్మటంలేదని ఇంతగట్టిగా ఎలాచెప్పగలరు ? ఏదేమైనా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమెచేసిన వ్యాఖ్యలు ఎలాగున్నాయంటే టీడీపీలో ఉంటే భవిష్యత్తులేదు కాబట్టి ఎంతమంది వీలైతే అంతమంది తమ్ముళ్ళు  పార్టీని వదిలేసి బీజేపీలో చేరండని పిలుపిచ్చినట్లే అనుమానంగా ఉంది.



ఎందుకంటే బీజేపీకి అర్జంటుగా అభ్యర్ధులు కావాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే పోటీచేయటానికి బీజేపీ తరపున సుమారు 150 నియోజకవర్గాల్లో గట్టిఅభ్యర్ధులే లేరనేది అతిశయోక్తికాదు. పోయినఎన్నికల్లో కూడా ఏదో పోటీచేశామంటే పోటీచేశామనిపించుకున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ఎవరికీ డిపాజిట్టు కూడా రాలేదు. రేపటి ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చేసుకుటుందని కాదు కాబట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వదలకుండా పట్టుకున్నది. కనీసం పవన్ ద్వారా అయినా డిపాజిట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచనలాగుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: