ఏపీలో ప్రధాని మోదీ సపోర్ట్ జగన్ కా ? చంద్రబాబుకా ?
కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారట. బీజేపీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాల మీద ఏపీ మీద ఫోకస్ పెట్టారట. అంతే కాకుండా ఇంతకు ముందు వరకు జగన్ పాలనపై పాజిటివ్ స్పందన రాగా.. ఇప్పుడు ఏంటి ఏకంగా నాలుగవ స్థానానికి పడిపోయాడంటూ ఆలోచనలో పడ్డారట. దీనితో ఏపీలో వచ్చే ఎన్నికలకు ఎవరికీ సపోర్ట్ చేయాలన్న విషయంపై కూడా వర్క్ అవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికప్పుడు చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ సమయంలో జగన్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. అదే విధంగా అంతకు ముందు ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు అండగా నిలబడి టీడీపీ గెలుపులో సపోర్ట్ చేశారు.
కానీ ఈ సారి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండడం బీజేపీకి చాలా అవసరం అని మోదీ భావిస్తున్నారు . ఇప్పుడు ఎన్నికల ముందు వరకు ప్రజలు నాడిని బట్టి తమ సపోర్ట్ ఉంటుందని క్లియర్ గా అర్ధమవుతోంది.