కూకట్ పల్లి హై టెక్ పేకాట రాకెట్ గుట్టురట్టు అయింది. లోధా అపార్ట్మెంట్స్ లో హై టెక్ పేకాట ఆడుతూ ఓ గ్యాంగ్ పట్టు పడింది. నిన్న సాయంత్రం పక్క సమాచారం తో లోదా అపార్ట్మెంట్స్ లో దాడులు చేశారు మాదాపూర్ SOT పోలీసులు. హై టెక్ పేకాట నిర్వహిస్తున్న నిత్యపు మురళిని మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. నిత్యపు మురళి తో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు మాదాపూర్ sot ఎస్వోటీ పోలీసులు. మూడు రోజుల క్రితం లక్షన్నర రూపాయలకు లోధా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కు తీసుకున్నారు నిత్యపు మురళి. సంపన్నులు నివసించే లోదా అపార్ట్మెంట్లో స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు నిత్యపు మురళి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసి ఆఫీస్ ఉన్న నిత్యపు మురళి.. ప్రతిరోజు లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నారు.
మొత్తం 2లక్షల 52వేల 140 రూపాయల తో పాటు 13 మొబైల్ ఫోన్స్,10సెట్ల కార్డ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ముత్యపు మురళి కి కస్టమర్ల కి మధ్య పని చేస్తున్న 3 సర్వెంట్స్ ,ఒక పిక్ అండ్ డ్రాప్ బాయ్,ఒక సెక్యూరిటీ మేనేజ్మెంట్ వ్యక్తి ఉండటం గమనార్హం. గతంలో రియల్ స్టేట్ వ్యాపారం లో నష్టం జరగడం తో పేకాట కి తెర లేపారు ముత్యపు మురళి. దీంతో గేమింగ్ ఆక్ట్ కింద కేస్ ముత్యపు మురళి పై నమోదు చేశారు KPHB పోలీసులు. ఇక ముత్యపు మురళి ని అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు K P H B పోలీసులు. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధిక వడ్డీ పేరుతో ముత్యపు మురళి మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. తెలంగాణలో ఏకంగా 3500 మంది బాధితులను ముత్యపు మురళి మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల నుండి 70 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.