కృష్ణుడు తనకు కల్లోకి వచ్చి రామ రాజ్యం స్థాపించమన్నాడని చెప్పి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పిన మాటలను అప్పుడే మరిచిపోలేం కూడా! అయితే ములాయంకు ఇంటి పోరు ఉంది.ఆయన చిన్న కోడలు బీజేపీలో చేరిపోయారు. ఇంకా ఇంకొందరు కూడా బీజేపీ సానుభూతి పరులగానే ఉన్నారు.ఎస్సీలు ప్రభావితం చేసే రిజర్వుడు స్థానాలు 84 ఉన్నాయని ఇందులో 68 శాతానికి మించి సీట్లు తెచ్చుకున్న పార్టీకే అధికారం దక్కుతుందని ప్రధాన మీడియా వెల్లడిస్తున్నది.