చైనాలో కఠిన లాక్డౌన్లు.. జనం గగ్గోలు..?
చైనాలో ఇప్పుడు నగరాలు నగరాలనే ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. ప్రజల కనీస అవసరాలను పాలకులు పట్టించుకోకపోతే.. పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. రెండేళ్లుగా ఇదే వైఖరిని చైనా అనుసరిస్తోందని చైనాకు చెందిన పత్రిక ది హెచ్కె పోస్ట్ విమర్శించింది. అయితే గంటల తరబడి ఎదురు చూసి ప్రభుత్వ కఠిన లాక్డౌన్లతో చైనా ప్రజల అవస్థలు పడుతున్నారు. ముందస్తు భయంతో చైనా నిబంధనలకు విరుద్దంగా లక్షలాది మందిని నిర్బంధిస్తోంది.
అంతే కాదు.. చైనా సమాజంలోని మిగిలిన వర్గాలను కూడా కలుపుకుని పోవాల్సిన అధికారులు.. అందుకు అనుమతించడం లేదు. గతంలో లాక్డౌన్లో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు అందక చాలా ఇబ్బందిపడ్డారు. అంతే కాదు.. సరకుల కోసం కూడా బయటకు రాకుండా ప్రజలపై నిషేధం ఇంటికి అందించే యాప్లు, సంస్థల్లోనూ సరుకుల కరవయ్యాయి. ఈ మేరకు జనం సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతున్నారు.
కొన్ని నగరాలు నెలల తరబడి లాక్డౌన్లో ఉంచుతున్నారు. ఉదాహరణకు షియాన్ నగరం గతేడాది డిసెంబర్ 23 నుంచి లాక్డౌన్లో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో తీవ్రమైన ఆహార పదార్థాల కొరతతో రోగులకు నరకం కనిపించిందట. అంతే కాదు.. దాదాపు కోటీ 30లక్షల జనాభా బయటకు రాకుండా నిర్బంధం విధించారట. చాలామంది ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చైనాలోని గూచి అనే పట్టణంలో కేవలం రెండు కేసులే ఉన్నా 10లక్షల మంది లాక్డౌన్లో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.