తాలిబన్ ల.. చెరలో 12వేల విదేశీయులు.. !
ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్స్ ఏవైనా అమలు కాని పక్షంలో ఖతార్ లో ఉన్న ఆయా విదేశీయుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలని తాలిబన్ లు బెదిరిస్తున్నారు. దీనితో ఇప్పటి వరకు వాళ్ళు మారతారు అనే చివరి ఆశ కూడా నశించిపోయింది. ఖతార్ లో దాదాపు 12000 మంది అమెరికా, బ్రిటన్, ఫ్యాన్స్ లాంటి తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఎవరైనా తాలిబన్ జోలికి వచ్చినా లేదా తాలిబన్ ల డిమాండ్స్ తీర్చకపోయినా ఖతార్ లో ఉన్న విదేశీయులను బ్రతకనీయబోమని వాళ్ళు బహిరంగంగానే బెదిరిస్తున్నారు.
ఇక తాజాగా ఐఎస్ మసీద్ పై చేసిన దాడిని తాలిబన్ లు ప్రపంచం కోసం ఖండించినప్పటికీ ఆ రెండు వర్గాలు వేరు కాదని వారంతా ఒకే కోవకు చెందిన వారని, వాళ్ళు కావాలనే ఇలాంటి రక్తపాతానికి పాల్పడుతూ ప్రపంచం దృష్టిని తమవైపు మళ్లించడానికి లేదా తమ కిరాతకాలను ప్రపంచానికి చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటిని పట్టించుకోని తాలిబన్ లను రక్షించడానికి పూనుకుంటే అంతకంటే వెర్రి తనం ఉండబోదని విశ్లేషకులు చెపుతున్నారు. గతంలో కూడా పాక్ తన దేశంలో తానే ఐఎస్ ద్వారా పేలుళ్లకు పాల్పడి, తమని తీవ్రవాదుల నుండి కాపాడాలని లేనిపోని భయాన్ని నటించినట్టే ఇప్పుడు తాలిబన్ లు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు.