భారత్ బంద్ విజయవంతం!
నోయిడాలో రైతులు చేపట్టిన భారత్ బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. నోయిడా అథారిటీ సమీపాన భారీ సంఖ్యలో రైతులు గుమికూడారు. అక్కడి పోలీసు బారికేడ్లను బద్దలుకొట్టి చొచ్చుకెళ్లారు. దీని తర్వాత వారు నోయిడా అథారిటీ వైపు దూసుకుపోయారు. పంజాబ్లో భారత్ బంద్ పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది. లూథియానాలోని లాడోవల్ టోల్ ప్లాజా మరియు ఎంబీడీ మాల్ ఫిరోజ్పూర్ రోడ్డు వద్ద నిరంతరం సిట్-ఇన్ నిర్వహించారు. ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ రోడ్డు మూసివేశారు. బస్టాండ్లు, పెట్రోల్ పంపులు కూడా మూతపడ్డాయి.
కాంగ్రెస్, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు, వైసీపీ భారత్ బంద్కు మద్దతు ఇచ్చాయి. బంద్కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కూడా మద్దతు ఇచ్చింది. అదే సమయంలో, రైతులు ఆందోళనను విరమించి, చర్చల మార్గాన్ని అవలంబించాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.
భారత్ బంద్ విజయవంతం కావడంతో ఇప్పుడు యునైటెడ్ కిసాన్ మోర్చా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. గతఏడాది సెప్టెంబర్ 27న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోద ముద్రతో అమల్లోకి వచ్చిన మూడు నల్ల చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత పది నెలలుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు.