తాలిబన్లలో వర్గపోరు షురూ!
ఆఫ్ఘనిస్థాన్లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం కోసమే తాలిబన్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. అమెరికా ఆర్మీ ఆ దేశం వెళ్లడానికి తానే కారణమని ముల్లా బరాదర్ భావిస్తున్నారు. అయితే తాము యుద్ధం చేసినందుకే అమెరికన్లు వెళ్లారన్నది ఖలీల్ హక్కానీ వర్గం వాదనగా ఉంది. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. విషయం పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లింది. ఈ ఘటన అనంతరం మంత్రివర్గ కూర్పుపైనా ముల్లా బరాదర్ అలిగారని తెలుస్తోంది.
మరోవైపు ముల్లా బరాదర్కు ఖతార్తో సత్సంబంధాలున్నాయి. ఆప్ఘనిస్థాన్ భవిష్యత్ నేతగా ముల్లా బరాదర్ను ఖతార్ సర్కారు చూపెట్టింది. తాలిబన్లపై ప్రపంచానికి సదాభిప్రాయం కలిగించేలా యత్నించింది. గతంలో పాకిస్థాన్ పెత్తనంలోని తాలిబన్ల అరాచకాలు చూసిన ప్రపంచ దేశాలు సైతం.. ఖతార్ మద్దతుతో మార్పు వస్తుందన్న అంచనాకు వచ్చాయి. ఖతార్ ద్వారానే ఆప్ఘనిస్థాన్కు చేయూత ఇస్తున్నాయి. అయితే పాక్ను మాత్రం పలు దేశాలు విశ్వసించడం లేదు. ఈ పరిణామాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. సొంత ప్రయోజనార్థం తన వర్గాన్ని రెచ్చగొట్టే పనిలో పడింది. ఆప్ఘనిస్థాన్ను టెర్రరిస్టులకు నిలయంగా చేయాలని ప్రణాళిక రచిస్తోంది. గతంలో ముల్లా బరాదర్ను పాకిస్థాన్ రెండు సంవత్సరాల పాటు అరెస్ట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేసింది. ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్థాన్కు పంపి భారత్పై ఉసిగొల్పాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే ఆప్ఘనిస్థాన్పై ఖతార్కు పట్టు ఉండరాదని శాయశక్తులా కృషి చేస్తోంది. చాలా వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది.