రేవంత్ వ్యూహం ఇదేనా.! అందుకే సురేఖను బరిలో దింపుతున్నారా..?

MOHAN BABU
ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటి నుంచి రాజకీయ వేడి ప్రారంభమైంది. అధికార పార్టీ దళిత బంధు పథకంతో సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించింది. బిజెపి తరఫున ఈటల రాజేందర్ పోటీ దాదాపు ఖరారైంది. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అభ్యర్థి ప్రకటించలేదు. మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త పాలకవర్గం తర్వాత కొత్త ఉత్సాహం నెలకొంది. దీంతో పార్టీ నుంచి పోటీ చేయడానికి కొందరు ఉత్సాహ పడుతున్న రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎస్సీ సామాజికవర్గం నుంచి దామోదర పేరు అనుకోకుండా వచ్చింది. ఆయన పోటీ చేయానని తెలిపారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి prabhakar GOUD' target='_blank' title='పొన్నం ప్రభాకర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పొన్నం ప్రభాకర్ పేరు వినిపించింది.

ఆయన కూడా ఆసక్తి చూపలేదు. కానీ బీసీ సామాజికవర్గం నుంచే పోటీకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య కొండా సురేఖ పేరు బాగా వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 226590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రెడ్డి ఓట్లు 22600 మున్నూరు కాపు 29100  పద్మశాలి 26350 గౌడ 24200 ముదిరాజ్ 23220 యాదవ 22150 మాల 11100 మాదిగ 35600 ఎస్టీలు 4220 నాయి బ్రాహ్మణ 3300 రజక 7600 మైనారిటీ  5100 ఇతర కులాల వాళ్ళు 12050 మంది ఉన్నారు. మొత్తంగా బీసీ సామాజిక ఓట్లు ఎక్కువ ఉన్నాయి. దీంతో బీసీ సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపితే  లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా కొండా సురేఖ పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు . అయితే కొండా సురేఖ ఇక్కడ పోటీ చేయాలంటే కొన్ని షరతులను పెట్టినట్లు సమాచారం. 2023 ఎన్నికల్లోనూ ఇక్కడే టికెట్ ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా వరంగల్ అర్బన్ భూపాలపల్లి, పరకాల టికెట్లు తమ వారికే ఇవ్వాలని తెలిపింది. అయితే మిగతా స్థానాలు రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసిన భూపాలపల్లి విషయంలో ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక కొండా సురేఖ ను బరిలో ఉంచడం వల్ల తమకు అన్ని విధాలుగా లభిస్తుందని పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది.. కొండా సురేఖ పద్మశాలి వర్గానికి చెందినవారు. దీంతో ఆ ఓట్లు నియోజకవర్గంలో 20 వేలకు పైగా ఉన్నారు వాటితో పాటు కొండా మురళీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారు. ఇలా కులాల వారిగా ఓట్లు లభిస్తాయని అనుకుంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజల్లోనూ కొంత ఆసక్తి వచ్చింది. దీంతో రేవంత్ యూత్ ఫాలోయింగ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టిఆర్ఎస్ బిసి అభ్యర్థిని బరిలో ఉంచగా బిజెపి తరపున  ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. దీంతో ఫలితం సంగతి ఎలాగున్నా పార్టీలో జోష్ పెరిగి ప్రభావం చూపిన ఫర్వాలేదని భావిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నిక కావడంతో ఆయన దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరి కొండా సురేఖ ఏ మేరకు ప్రభావం చూపనున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: