ఒక్క దెబ్బకు రూ.42కోట్ల నష్టం..!
మరోవైపు ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని పలు ప్రదేశాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బీహార్ వైపు వెళ్ల.. బలహీనపడినట్టు వివరించింది. అయినా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారగా.. జురాల, తుంగభద్ర రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఈ రోజు తుంగభద్ర జలాశయం గేట్లను కర్ణాటక ప్రభుత్వం ఎత్తే అవకాశం ఉండగా.. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ.. తెలంగాణ, ఏపీ అధికారులను కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం చేసింది.