భోజనం తర్వాత.. అస్సలు చేయకూడని పనులు ఇవే?
ఇలా అధునాతన జీవనశైలిలో తినడం,కూర్చోవడం, పడుకోవడం ఇలాగే సాగిపోతుంది అందరి జీవితం. వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తిన్న తర్వాత ఎవరూ కూడా తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలా భోజనం చేయగానే తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం తర్వాత కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. ఇక భోజనం తర్వాత కొన్ని రకాల పనులు చేస్తే ఆరోగ్యం దబ్బతినటం ఖాయం అంటూ చెబుతారు.
ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదట.. ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ మంట వంటివి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే ఇక ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట సేపటి వరకు వేచి చూసి అప్పుడు స్నానం చేయాలని సూచిస్తున్నారు . అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే వివిధ రకాల పండ్లు కూడా తినడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. భోజనం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి పండ్లు తింటే ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇక భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం శ్రేయస్కరం కాదు అని అంటున్నారు నిపుణులు.
భోజనం చేసిన వెంటనే నిద్రపోవటం కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదని ఇక తద్వారా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెబుతున్నారు. చాలామంది ఫుల్లుగా ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.. భోజనం చేసిన తర్వాత వ్యాయామం చేయకూడదని భోజనానికి వ్యాయామానికి కాస్త గ్యాప్ ఇవ్వాలని చెబుతున్నారు. కానీ భోజనం చేయగానే కొంచెంసేపు నడవడం మాత్రం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.