బంపర్ ఆఫర్.. మీరు కూడా విమానంలో వెళ్లొచ్చు..?
ఈ క్రమంలోనే ఎంతో మంది సామాన్య ప్రజలు ఇలా విమానంలో ప్రయాణించాలి అని భావించినప్పటికీ ఇక ఆ తర్వాత విమానంలో ప్రయాణించడానికి భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని భావించి ఇక సైలెంట్గా ఉండి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మీకు కూడా ఇలా విమానంలో ప్రయాణించాలి అనే కోరిక ఉంటే ఎక్కడ వెనకడుగు వేయకండి.. ఎందుకంటే మీకోసం ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అప్పుడప్పుడు విమానయాన సంస్థలు ఇక ఏకంగా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ అతి తక్కువ ధరకు విమాన టికెట్లు అందుబాటులో ఉంచుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ మీ కోసం సిద్ధంగా ఉంది. ఎయిర్ ఇండియా అలియన్స్ ఇటీవలే ఒక సమ్మర్ బోనాంజ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 999 రూపాయలు చెల్లించి విమానంలో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తుంది ఎయిర్ ఇండియా. అయితే కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇలా ₹999 చెల్లించి విమానంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రధాన నగరాలలో ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎయిర్ ఇండియా. ఇకపోతే ఏప్రిల్ 31 నుంచి సెప్టెంబర్ 30 మధ్య 999 రూపాయలకే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ప్రయాణానికి వారం రోజుల ముందు ట్రావెల్ డేట్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. అయితే సోమవారం వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.