ఇలా మాత్రం చేయకండి.. విమానం నుండి దింపేస్తారు..?
అదే సమయంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇక ప్రజలలో ధైర్యం వచ్చింది అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో.. చాలామంది కరోనా వైరస్ ని లైట్ తీసుకుంటూ ఇక మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం భౌతిక దూరం పాటించక పోవడం లాంటివి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. తద్వారా కొన్ని రాష్ట్రాలలో మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం అందరిలో కరోనా వైరస్ పై భయం పోవడంతో ఇక అటు విమానాశ్రయాల్లో కూడా ఎంతోమంది వైరస్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
వెరసి ఎంతో మంది వైరస్ వ్యాప్తికి కారకులుగా మారిపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రయాణికుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విమాన ప్రయాణికుల నిర్లక్ష్యం పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ నిబంధనలు పాటించని వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని డి సి జి ఎ, విమాన సర్వీసులకు మార్గదర్శకాలు జారీచేసింది. ఎవరైతే మాస్కు పెట్టుకోరో వారిని విమానం బయలుదేరే ముందు కిందికి దింపేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 15 రోజుల లోగా నివేదిక అందించాలి అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.