చిన్నారుల్లో జ్వరం, గొంతునొప్పి.. డాక్టర్లు ఆసక్తికర నిజాలు..?
అయితే పిల్లల్లో దగ్గు జ్వరం గొంతు నొప్పి లాంటి సమస్యలపై తాజాగా వైద్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గొంతు నొప్పి జ్వరం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలతో పాటు వాతావరణం కూడా ఎంతో చల్లగా ఉంటుందని... ఈ కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో కూడా వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన లక్షణాలు కరోనా లక్షణాలు కు దగ్గరగా కనిపిస్తాయని... కానీ తల్లిదండ్రులు ఇలాంటి లక్షణాలపై కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ వైద్యులు చెబుతున్నారు.
కరోనా వైరస్ లక్షణాలు మాదిరిగానే టాన్సిలైటిస్ వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయి అని చెప్పిన వైద్యులు... గొంతునొప్పి జ్వరంతో పాటు మెడ వద్ద వాపు గొంతులో మంట, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని తెలిపారు. అంతేకాకుండా చల్లటి వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయని చెప్పారు. అయితే ఇది కూడా ప్రమాదకరమే అంటూ చెబుతున్న వైద్యులు... 10 నుంచి 15 రోజుల వరకూ ఇలా పిల్లల్లో లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది ఏకంగా శస్త్రచికిత్స వరకు దారితీసే ముప్పు ఉందని వైద్యులు సూచిస్తున్నారు.