తెలుగు డాన్ ను లేపేసిన యుపి సర్కార్..?
డాన్... ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమా. ఈ సినిమాలో డాన్ అంటే ఎలా ఉంటారు ఏంటి అనేది ప్రేక్షకులందరికీ చూపించాడు నాగార్జున. ఈ ఒక్క సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో డాన్ ఉంటాడు. ఇక ఎంతోమందిని కంట్రోల్ చేస్తూ లూటీలు చేస్తూ మర్డర్లు చేస్తూ ఉంటాడు డాన్. రియల్ లైఫ్ లో డాన్ ఉన్నారా అంటే.. ఎందుకు లేరు అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే అక్కడ చాలామంది విద్యార్థులు తమ దందా సాగిస్తూ ఉంటారు. తెర మీద ఎక్కడా కనిపించకపోయినప్పటికీ లోపల లోపల జరిగేవన్నీ జరిగిపోతూవుంటాయి.
ఇక ఈ డాన్ లు ముంబై నగరంలో ఎక్కువగా ఉంటారు. ముంబై లో ఎక్కువగా మాఫియాడాన్ లు కనిపిస్తూ ఉంటారు. దావూద్ ఇబ్రహీం, చోటా భాయ్ ఇలా ఎంతో మంది డాన్ లు ముంబై నగరంలో ఉంటారూ. ముంబైలో డాన్ లు ఉన్నారు సరే... మరి తెలుగు వాళ్ల నుంచి ఒక్కరు కూడా ముంబైకి వెళ్లి డాన్ గా మారలేదా అనే చర్చ వచ్చిన సమయంలో... తాజాగా ఒక తెలుగు డాన్ ముంబై లో కూడా ఉన్నాడని తెలిసింది. అయితే శివశక్తి నాయుడు అనే వ్యక్తి హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుందర్ దగ్గర 8 కోట్లు లూటీ చేయగా... దీనిపై ఏకంగా అరెస్టయి జైలుకు కూడా వెళ్ళి కొన్ని రోజులపాటు తీహార్ జైలు శిక్ష అనుభవించాడు.
ఇక బీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే కొంతమంది ఈ గ్రూపు ని క్రియేట్ చేసి ఆ తర్వాత ఆ గ్రూప్తో ఏకంగా అతన్ని అరెస్టు చేస్తున్న పోలీసు ఆఫీసర్ ని కూడా చంపే ప్రయత్నించాడు అలా శివశక్తి ఎదిగాడు. అయితే శివశక్తి నాయుడు పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తుండగా యూపీలో ఒక సెటిల్మెంట్ కోసం వెళ్ళాడు. ఇక ఇదే సమాచారాన్ని ముంబై పోలీసులు యూపీ పోలీసులకు సమాచారం అందించగా చాకచక్యంగా... తెలుగు డాన్ శివశక్తి నాయుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి పారేసారు. ఈ క్రమంలోనే తెలుగు డాన్ ను యుపి సర్కార్ చంపేసింది అంటూ వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.