సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం... టికెట్ కోసం వచ్చిన వృద్ధుడిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి... !

Reddy P Rajasekhar

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకోవడానికి వచ్చిన ఒక వృద్ధుడిని రైల్వే మహిళా ఉద్యోగి అకారణంగా చెప్పుతో కొట్టింది. అకారణంగా చెప్పుతో కొట్టటంతో వృద్ధుడు మహిళా ఉద్యోగిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజమాబాద్ జిల్లా మాలపల్లికి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ నెల 24వ తేదీన కంటి పరీక్షల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. 
 
హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత సొంతూరుకు తిరిగి వెళ్లటానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి మహిళా ఉద్యోగిని సీనియర్ సిటిజన్ టికెట్ కావాలని కోరాడు. వృద్ధుడితో మహిళా ఉద్యోగి టికెట్ విషయంలో గొడవ పెట్టుకుంది. మహిళా ఉద్యోగి, వృద్ధుడి మధ్య మాటామాటా పెరిగింది. 
 
టికెట్ కౌంటర్ నుండే ఉద్యోగి ఆ వృద్ధుడిపై చేయి చేసుకుంది. ఆ తరువాత మహిళా ఉద్యోగి కౌంటర్ నుండి బయటకు వచ్చింది. ఆ తరువాత మహిళా ఉద్యోగిని ఆగ్రహంతో వృద్ధుడిని చెప్పుతో కొట్టింది. మహిళా ఉద్యోగిని ఏమీ అనలేక వృద్ధుడు రైలులో సొంతూరుకు వెళ్లిపోయాడు. ఊరికి వెళ్లిన తరువాత అతని స్నేహితులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన గురించి చెప్పాడు. 
 
వృద్ధుడు తన స్నేహితులతో కలిసి నిన్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు మహిళా ఉద్యోగి గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల విషయంలో దురుసుగా ప్రవర్తించిన మహిళా ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని వృద్ధుడు కోరుతున్నాడు. రైల్వే అధికారులు ఈ ఘటన గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: