జగన్ కి 115 ప్రశ్నలు అంటూ తెదేపా అభిమానుల సోషల్ మీడియా యుద్దం

Edari Rama Krishna
సోషియల్ యూజర్ రాసిన ఈ పోస్ట్ లో భావాలు రచయిత సొంత అభిప్రాయలు అని గమనించండి..

వైస్సార్సీపీ వాళ్ళు అందరిని నేను అడగడలుసుకున్న ప్రశ్నలు…వైస్సార్సీపీ గురించి… మీరు సమాధానాలు చెబుతారో… లేక జగన్ అన్న సమాధానాలు చెబుతారో చెప్పండి…. నా 115 ప్రశ్నలకి సమాధానం కావాలి… ఎవరు చెప్పినా పర్లేదు…

✍జగన్మోహన్ రెడ్డి విశృంఖలమైన నీ అవినీతిపై అడిగే ఈ ప్రశ్నలకి వీటికి సమాధానం చెప్పే దమ్ముందా!
1. ఒకప్పుడు అప్పుల్లో ఉన్న నీ కుటుంబం, అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మడానికి అప్పటి సి.ఎం కు లేఖ రాసిన నీ కుటుంబం, ఇప్పుడు దేశం లోనే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించే విధం గా ఎలా ఎదిగింది? ఆ కిటుకు చెపితే ప్రజలు కూడా నిన్నే అనుసరిస్తారు, అప్పుడు సంక్షేమ పధకాలు కూడా అవసరం లేదు, నీ లాగా శాశ్వత అభివృద్ధి కావాలి. ఇంత తెలివి ఉంటే నిన్ను బిజినెస్ స్కూల్స్ లో పాఠాలు చెప్పడానికి పిలవరెందుకు?
2. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే నువ్వు, నీ పైన ఉన్న అక్రమాస్తుల కేసులో 10 సిబిఐ ఛార్జ్ షీట్స్ గురించి విపులం గా గురించి ప్రజలకు వివరించ గలవా? సిబిఐ కేసులలో చార్జ్ షీట్స్ ఉన్న వారికి (నీ తో సహా) సీట్లేందుకు ఇస్తున్నావు? నీ పార్టీ కి అవినీతి మీద ఒక విధానం అంటూ ఉందా?
3. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చాల్సిన అధికారంతో వ్యవస్థలను ధ్వంసం చేసి – ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ముఖ్యమంత్రి పీఠాన్నీ తనయుడి ఆర్థిక అవసరాలు తీర్చే అక్షయ పాత్రగా వైఎస్‌ మార్చేశారని విజిలెన్స్‌ కమిషనర్‌గా పని చేసిన ఐఏఎస్‌ అధికారి రామచంద్ర సమాల్‌ 2007లో వెల్లడించారు. వీటిని ఖండించే ధైర్యం ఉందా?
 
4. రాజన్న పాలన తెస్తామంటున్నారు. వేళ్లూనుకున్న అవినీతి వూడలు రాష్ట్రం ఎల్లలు దాటి ఖండాంతరాలు వ్యాపించడమేనా రాజన్న పాలన అంటే? సీబీఐ నుంచి ఎఫ్‌బీఐ స్థాయి వరకు మీపై కేసులున్న మాట వాస్తవం కాదా?
5. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి 10 రూపాయల షేరు 350కు, 1440కి అమ్ముకోలేదా? సొంత కంపెనీ మదింపు విలువ అనేక రెట్లు ఎక్కువ చేసి 3వేల కోట్ల రూపాయలుగా చూపించి మోసం చేయలేదా?
6. హైదరాబాద్ లోని అవినీతి సొమ్ముతో బెంగళూరు లో 4000 ఎకరాలు కొన్నది నిజం కాదా? ఇప్పటికీ బెంగళూరు లో పెద్ద భూస్వాములు మీ కుటుంబమే కదా!
7. బెంగళూరు యెలహంక లో 35 ఎకరాల రూ 500 కోట్ల పాలస్, బెంగుళూరు హెచ్.ఎస్. ఆర్ లేఔట్ లో బినామీ పేర్లతో వేల కోట్లు విలువ చేసే వందల కొద్దీ బినామీ ఇళ్లు, నగరం నడిబొడ్డున మంత్రి మాల్, అరికేరే లో వందల ఎకరాలు భూములు, గేటెడ్ టౌన్ షిప్స్ ఎలా వచ్చాయో చెప్పగలవా? ఇవన్నీ కూడా కడప లోని సామాన్య ప్రజల పేరుతోనే బినామీలుగా కొన్నావు కదా?
8. ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించేశాక – ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా?
9. అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది వైఎస్‌. కాదనగలరా? ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలగలేదా?
10. వైఎస్‌ ముఖ్యమంత్రి కాకముందు కర్ణాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్‌ హ్యాండ్‌ విద్యుత్‌ ప్లాంటు నడుపుకొంటున్న మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?
11. నువ్వు, నీ నాయన జెరూసలెం వెళ్ళేది దైవ దర్సనానికా లేక దొంగ లెక్కలు సరిచూడడానికా? మాకు తెలియదు అనుకున్నావా? లండన్, సైప్రస్, మారిషస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, లక్సంబుర్గ్ నుండే కదా నీ నల్ల డబ్బు అంతా నీ కంపెనీలలో విదేశీ పెట్టుబడుల రూపం లో వచ్చేది. ఇదే కదా సిబిఐ, ఈడి, ఆదాయ పన్ను శాఖ లు చెప్పింది! ఇప్పటికే సిబిఐ ఆయా దేశాలకు మరింత సమాచారం కోసం లేఖలు పంపడం నిజం కాదా?
 
12. కృష్ణ పట్నం పోర్ట్, గంగ వరం పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, మచిలీ పట్నం పోర్ట్ లో నీ వాటా ఎంత? వాళ్ళంతా నీ బినామీ లే కదా? నువ్వు – కెవిపి – వైఎస్ నిర్మించిన అవినీతి పునాదులే కదా ఇవి, ఈ పోర్ట్ లను ఉపయోగించే కదా నీ చెంచాలు ఐన బళ్ళారి రెడ్డి బ్రదర్స్ దొంగ రవాణా, అక్రమ రవాణా చేసేది. సి.బి.ఐ కూడా ఇదే చెప్పింది కదా?
13. మన రాష్ట్రం లో గ్రూప్ 1 టాపర్ అయిన ఐఏఎస్ శ్రీలక్ష్మి జీవితం ను అవినీతిలో ముంచి సర్వ నాశనం చేసింది నువ్వు కాదా? జైలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంది. నీ అక్రమాస్తుల కేసులో ఐఎఎస్. రత్న ప్రభ నిన్ను కోర్ట్ ఆవరణలో పట్టుకొని తిట్టడం నిజం కాదా?
14. నీ నాయన, నీ అక్రమాస్తుల కేసుల మూలంగా 108 మంది పారిశ్రామిక వేత్తలు, అధికారులు అవినీతి కేసులు ఎదుర్కోవడం నిజం కాదా? వీరేవ్వరికీ బెయిల్ రాకుండా నీ ఒక్కరికే బెయిల్ ఎలా వచ్చింది? ఈ బెయిల్ డీల్ కోసమే కదా రాష్ట్ర విభజన జరిగింది? వారిని ఎప్పుడైనా ఓదార్చావా?
15. నీవు కూడబెట్టిన వేల కోట్లు, బడుగు బలహీన వర్గాలు, వృద్ధులు, మహిళలు, విద్యార్ధులవే కదా? నేవ్వొచ్చి వీళ్ళకి సంక్షేమ పధకాలు ఇస్తావా? నిన్ను నమ్మాలా? సి.ఎం కొడుకు గానే అంత దోచిన వాడివి, సి.ఎం అయితే ఇంకెంత దోచుకు తింటావో అని కోస్తా ప్రజలు, సీమ ప్రజలు భయపడుతున్నారు! ఇది నీకు తెలియదా?
16. ఇలా ఎడాపెడా సంతకాలు పెట్టె కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నీ కుటుంబం? ఇంకేమి సంతకాలు మిగిలాయి? మీ నాన్న సంతకానికి 10 కోట్లు తీసుకొనేవాడు కదా! ఇది మర్చిపోయావా?
17. మౌలిక సదుపాయాల కంపెనీలు అయిన మెయిల్, ఇందు ప్రాజెక్ట్స్, ఐ.వి.ఆర్.సి.ఎల్, కె.ఎం.సి, నవయుగ, రాంకీ లాంటివి అన్నీ నీ బినామీలే కదా? వీటిలో డబ్బే నీ కంపెనీలలో, నీ జేబులోకి పోయేది! ఇవన్నీ కూడా ఈ రోజు సిబిఐ కేసులలో ఉన్నాయి కదా?
18. ఎన్.డి.టి.వి కి సంవత్సరానికి 30 కోట్లు ఇచ్చి నీ మీద దొంగ సర్వే లు చేయించు కొంటున్నావు కదా? జాతీయ మీడియా లో నీ మీద భజన చేయించుకుంటూన్నావు కదా? నీ సాక్షి కి – ఎన్.డి.టి.వి కి మధ్య జరిగిన డీల్ బయటపెట్టే దమ్ముందా?
19. నీకు – ఇండియా టుడే గ్రూప్ కి ఎంతకీ ఒప్పందం కుదిరింది, భజన చేయించుకోవడానికి? వీళ్ళు, సి-వాటర్ సహకారం తో చేసే సర్వే లు దొంగ సర్వేలు అని బయట పడింది కదా?
20. హైదరాబాద్ లో నీరజా రావు భూమిని ఆక్రమించాలని చూసి కోర్ట్ లో మొట్టి కాయలు వేయించుకున్నావు కదా? మరిచితివా? నీరజా రావు విమర్శలకు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేక పోయావు కదా? ఆవిడ మాట్లాడితేనే నీ గుండెల్లో దడ కదా?
 
21. సిబిఐ కేసులలో భాగం గా వాళ్ళు నిన్ను ప్రశ్నించిన 5000 ప్రశ్నలను ప్రజలకు చెప్పా గలవా? నీ దొంగ సాక్షి లో ప్రచురించగలవా? అంత దమ్ము, దైర్యం ఉన్నాయా?
22. పైసా కూడా నీ సొంత పెట్టు బడి లేకుండా భారతి సిమెంట్స్ పెట్టి, సున్నపు రాయి, నీరు, భూమి, ఋణం అన్నీ కూడా ప్రభుత్వం నుండి తీసుకొని, చివరికి ఆ కంపెనీని 6000 కోట్ల కు అమ్మడం నిజం కాదా? అది ఎవడబ్బ సొమ్ము? ఇందులో ప్రభుత్వానికి ఎంత ఇచ్చావు?
23. అవినీతి కేసులలో జైలు లో ఉండి నువ్వా విలువలు గురించి మాట్లాడేది? జైలు లో కూడా నువ్వు వెలగపెట్టిన బాగోతాలు మాకు తెలియవు అనుకుంటున్నావా?
24. కొండా దంపతులు వాళ్ళ 200 కోట్ల అవినీతి సొమ్ముని నీ దగ్గర పెడితే, తరువాత లేదు పొమ్మన్నావు కదా? అందుకే కదా వాళ్ళు నీ పార్టీ లో చేరింది, తరువాత వీడింది? ఇదేనా విశ్వసనీయత?
25. 2009 ఎన్నికల ముందు ఉరుకులు పరుగులతో హడావుడిగా మార్చి 2న రికార్డు స్థాయిలో 389 జీవోలు జారీ చేసి మూటలు కట్టుకున్నది నిజం కాదా? ఆ హడావిడి జీవోల వెనక ఉన్న మతలబులేమిటి?
26. నీ అవినీతి సొమ్ముతో 50000 కోట్ల పవర్ ప్రాజెక్ట్స్ – 10000 మెగా వాట్స్ ను ఆంధ్ర తో సహా వివిధ రాష్ట్రాలలో మొదలు పెట్ట లేదా? ఇంత డబ్బు నీకేక్కడిది? ఈ కరెంటు ను ఆంధ్ర లో రైతులకు ఉచితం గా ఇవ్వ గలవా?
27. మొన్నటి దాకా ఎం.బి.ఎ అని చెప్పుకు తిరిగి 2011 లో నువ్వు చేసింది బికాం మాత్రమే అని చెప్ప లేదా? నీ కంపెనీ అఫిడవిట్ లో ఎం.బి.ఎ అని 2012 ఎన్నికలలో బికాం అని చెప్పడమేనా నీ విశ్వసనీయత?
28. నీ సాక్షి పత్రిక లో పెట్టుబడులు అన్నీ అక్రమ పద్దతుల్లోనే వచ్చినవి కాదా? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా? అందుకే కోర్ట్ బోను ఎక్కావు కదా?
29. నరసారావుపేట టికెట్ ను అయోధ్య రామి రెడ్డి కి 100 కోట్ల కు అమ్ముకోలేదా? ఈ డబ్బు చెల్లించడానికి అతను విశాఖ, హైదరాబాద్ లో ఉన్న ఫార్మా కంపెనీ ని అమ్మకానికి పెట్టడం నిజం కాదా?
30. ఎం.పి టికెట్స్ ఇస్తానని చెప్పి పివిపి, రఘు రామ కృష్ణమ రాజు చేత కోట్లు ఖర్చు పెట్టించడం నిజం కాదా?
31. ఎం.పి సీటు కి 50 కోట్లు, ఎంఎల్ఎ సీటు కి 20 కోట్లు రేట్ ఎందుకు పెట్టావు? ఇంకా ఆశ తీరలేదా? వీటి అమ్మకాల ద్వారా నువ్వు సంపాదించినదే 5000 కోట్లు వుంటుంది కదా! ఇంకెంత కావాలి?
 
32. నీవు జైలు లో వున్నప్పుడు టికెట్స్ అమ్ముకొని నీకు వాటా ఇవ్వనందుకే కదా, నీ బాబాయి వైవి. సుబ్బా రెడ్డి ని దూరం పెట్టావు?
33. లక్షన్నర కోట్ల విలువైన బయ్యారం గనులు, నీ బావ కు చెందినా రక్షణ స్టీల్స్ కు నీ కుటుంబం ఆడపడుచు కట్నం గా ఇవ్వడం నిజం కాదా? గిరిజనులను బినామీ గా పెట్టుకొని మీరే దోచుకు తింటున్నారు కదా?
34. అనంతపురం లో ఓబులాపురం మైన్స్ లో 10,000 కోట్ల వరకు దోచుకుంటే, ఆ కేసులో గాలి జైలు లో వున్నాడు కదా? అందులో నీ వాటా 50% అనేది జగమెరిగిన సత్యం కదా? రెండు కంపెనీల డైరెక్టర్ లు (సజ్జల బ్రదర్స్) సాక్షి పత్రికలో డైరెక్టర్ లే కదా. ఇంతకన్నా రుజువులు కావాలా నువ్వెంత గజ దొంగ వో చెప్పడానికి.
35. ఆరు లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని గాలి సోదరులు తరలించుకుపోయేలా వ్యూహ రచన చేయడమే కాదు… జాతి సొత్తును కొందరు వ్యక్తులకు కట్టబెట్టేలా చేసింది మీరు కాదా?
36. 2007-10ల మధ్య 5194.33 కోట్ల రూపాయల ఖనిజాన్ని గాలి సోదరులకు అడ్డగోలుగా అప్పగించిన మీరే – ఉక్కు కర్మాగారం ఏర్పాటుని ప్రతిపాదించి పదివేల ఎకరాల స్థలాన్ని, కడపలో విమానాశ్రయం పేరిట మరో 4వేల ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టారు. నిబంధనలు కాలరాసి రెండు శత కోటి ఘనపుటడుగుల కృష్ణా నీటిని తరలించేందుకు తీర్మానించింది వైఎస్‌ కాదా?
37. కబ్జా చేసిన అటవీ భూముల్లో లక్షా 95వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని గాలి సోదరులు కొల్లగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారా లేదా?
38. ఇప్పుడు నువ్వు ఉంటున్న లోటస్ పాండ్ బిల్డింగ్ ఖరీదు 700 కోట్లు కాదా? ఇంత డబ్బు నీకేక్కడిది? కంపెనీలు ఎక్కడైనా ఇల్లు కడతాయా? నీ సంపాదనే అయితే ఈ ఇంటిని కంపెనీల పేరుతో ఎందుకు చూపిస్తున్నావు? ఇవే కంపెనీల నుండి కారు చౌక గా కొట్టే సి, నీ నల్ల డబ్బు ని తెల్ల డబ్బు గా మార్చు కుందామనే కదా!
39. 60% ఆదాయం అందిస్తూ, ప్రభుత్వానికి వేల కోట్లు పన్నులను ఇస్తున్న, ఆంధ్ర రాష్ట్రం అవసరాలను తీరుస్తున్న ఖనిజ సంపదను పక్క రాష్ట్రాలకు, గాలి జనార్ధన రెడ్డి లాంటి అవినీతి పరులకు తరలించింది ఎవరు..? నువ్వు నీ నాయన కాదా?
40. 2004 Y.S రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన తన కుమారుడి ఆస్తుల విలువ 8.19 లక్షలు, 2009లో Y.S రాజశేఖర్ రెడ్డి డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 1.32 కోట్లు, 2009లో ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన జగన్ మరియు అతని భార్య ఆస్తుల విలువ 77.40 కోట్లు…2011 బై ఎలక్షన్ నాటికి ఎలక్షన్ కమిషన్ కు డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 410 కోట్లు…( Y.S.జగన్ ఆస్తుల విలువ
365 కోట్లు మరియు తన భార్య పేరుతో 47.25 కోట్లు(నగలతో కలిపి)ప్రకటించాడు.) 2011 బై ఎలక్షన్ నాటికి బెంగుళూరు ఎలహంక లో వున్న ఇల్లును,హైదరాబాద్ లోటస్ పాండ్ లో వున్న ఇంటిని లెక్కలో చూపించలేదు. ఇదంతా ఎలా సంపాదించావు? కనీసం నీ భార్య, పిల్లలకు అయినా తెలుసా?
41. సాక్షి మరియు మని లాండరింగ్ ద్వారా జగన్ అక్రమంగా సంపాదించిన 890కోట్ల ఆస్తులను ఈడి జప్తు చేసింది .ఇంకా 7 చార్జీ షీట్లలో 2000కోట్లు అటాచ్ చేయబోతుంది. దీని మీద సమాధానం చెప్పగలవా?
42. నీ సాక్షి పత్రిక జిల్లా ఆఫీసులు/స్థలాలు అన్నీ కూడా ముందుగా కాకినాడ ఎం.ఎల్.ఎ చంద్రశేకర రెడ్డి చేత కొనిపించి, అక్కడనుండి నువ్వు నీ జనని ఇన్ఫ్రా ద్వారా చౌక గా కొట్టేయ్యలేదా? ఎందుకు ఇంత దాపరికం? ఇదంతా అవినీతి సొమ్మే కదా? నీ జనని ఇన్ఫ్రా లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరిదీ ఇదే కధ కాదా?
43. కలకత్తా లోని 30 అల్లి బిల్లి కంపెనీల ద్వారా కొన్ని వందల కోట్లు నీ కంపెనీలోకి ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? దేశం లో అన్ని దర్యాప్తు సంస్థలు నిన్నే దోషి గా తేల్చాయి కదా! దీని గురించి ప్రజలకు వివరించగాలవా? అదంతా నీ నల్ల డబ్బే కదా? నీ నాయన సంతకాలు చెయ్యగా వచ్చిందే కదా?
44. 10 కేసులలోనే నీ అవినీతి లెక్క 43 వేల కోట్లు గా సిబిఐ తేల్చింది కదా? ఎప్పుడైనా ప్రజలకు సమాధానం చెప్పావా? పోనీ నీ పత్రిక కి అయినా, లేక నీ భార్య కి అయినా?
45. ఆంధ్ర రాష్ట్ర ఖజానా ను అప్పనం గా కొల్లగొట్టిన నీ కుటుంబాన్ని అఖిల ఆంధ్ర ప్రజలు దొంగల ముఠా అనడం నిజం కాదా?
46. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఒకరు, 12 కోట్ల వరకు ముడుపులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ టికెట్ ఆశించిన మరో ప్రముఖుడు 72 కోట్ల వరకు బేరం కుదుర్చుకున్నట్టు చెబుతున్నారు. విజయవాడ నుంచి ఎంపీ అయిపోదామనుకున్న ఒకరు ఇప్పటికే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీలో పరిస్థితులు నచ్చక పోవడంతో మిడిల్ డ్రాప్ అయిపోయారు. సింగపూర్‌లో ఏదో వ్యాపారం చేసి వంద కోట్ల వరకు సంపాదించిన ఒకరు, ఒంగోలు లోక్‌సభ టికెట్ ఇస్తే 25 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. వీటి లో ఎన్ని నిజాలు ? అసలు మొత్తం వసూలు ఎంత?
47. విశాఖపట్టణం నుంచి ఎలాగైనా ఎంపీగా ఎన్నిక కావాలని పట్టుదలతో ఉన్న తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిని 91 కోట్ల వరకు డిమాండ్ చేసిన విషయం నిజం కాదా?
48. మచిలీపట్నం లోక్‌సభ సీటు ఆశించి 12 కోట్ల వరకు సమర్పించుకున్న తనకు టికెట్‌పై ఎటువంటి హామీ లభించకపోవడంతో ఆందోళన చెందిన కుక్కల నాగేశ్వరరావు, ఆ బాధతోనే ఇటీవల గుండెపోటుకు గురై మరణించారన్నది నిజం కాదా? చివరికి ఆయన కొడుకికి కూడా చేయ్యివడం నిజమే కదా?
49. దాడి వీరభద్రరావు, రత్నాకర్‌, తమ్మినేని సీతారాంకు,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,భూమా దంపతులు ,షర్మిల, వైవీ సుబ్బారెడ్డి,కొండా దంపతులు యావత్ తెలంగాణా నాయకులు ఇలా జగన్ ని నమ్ముకున్న వారి ‘బాధితుల’ జాబితా అంతకంతకూ పెరుగుతోంది. జగన్ ని నమ్మితే చివరికి జనాలని కూడా అమ్మేస్తాడు అనేది నిజమే కదా?
50. నీ నాయన పాలన పై, ప్రతి శాఖ పై, ప్రతి నిర్ణయం పై, సంతకం పై, నీ ఆస్తుల పై, నీ బినామీ ల పై, నీ బంధువుల పై సిబిఐ దర్యాప్తు నకు సిద్దమేనా?
51. మీ నాయన అవినీతి సొమ్ము లో 10 వేల కోట్లు కెవిపి దగ్గర దాచాడు, నీ నాయన చావు తరువాత వీటి గురించే కదా నీకు కెవిపి కి గొడవలు వచ్చాయి, మాకు తెలియవు అనుకుంటున్నావా?
52. హైదరాబాద్, ఆంధ్ర లో ఉన్న 50 సెజ్ లు నీ బినామీలవే కదా, దీని పై సిబిఐ దర్యాప్తు నకు సిద్దమేనా? కాగ్ రిపోర్ట్ కూడా ఇదే చెప్పింది కదా. వీటి మీద చర్చించే దమ్ముందా!
53. సత్యం రామలింగ రాజు పతనానికి కారణం నీ యొక్క కమీషన్ ల డబ్బు ఒత్తిడే కదా! ఈ సత్యం మొత్తం కదా చెపితే వినే దైర్యం ఉందా నీ కుటుంబానికి?
54. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ తెరపైకి తెచ్చి ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి 9 నెలలోనే 8,444 ఎకరాల భూమిని కట్టబెట్టారు. 10వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్న ఆ సంస-్థ 4650 ఎకరాలను తాకట్టు పెట్టి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఐడిబీఐ, కెనరా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకుల నుంచి 830 కోట్లు రుణం పొందినట్లు 9వ చార్జిషీటులో సీబీఐ చూపించింది వాస్తవమా కాదా?
55. ఇందు – శ్యాం ప్రసాద్ రెడ్డి దివాలా తీయడానికి నీ స్కాం లే కదా ప్రధాన కారణం. ఇందు ప్రాజెక్ట్ ను అమ్మగా వచ్చిన డబ్బు – 400 కోట్లు , లేపాక్షి హబ్ ను తాకట్టు పెట్టిన డబ్బు – 800 కోట్లు అంతా నువ్వే కదా లాక్కున్నావు.
56. నువ్వు నీ స్వార్ధం కోసం మమ్మల్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతావా….ఎంత నిజాయితీగా బ్రతికి న వాళ్ళం…ఇప్పుడు నీ మూలాన కోర్టులు చుట్టూ తిరుగుతున్నాం…! అని సిబిఐ కోర్టులో నిన్ను కడిగి పారేసింది కదా ఐఎఎస్ రత్న ప్రభ…! నీది కూడా ఒక బ్రతుకేనా?
57. వైఎస్ వున్నప్పుడు మీ అక్రమాలను కప్పిపుచ్చ దానికి సాయి రెడ్డి ని ఆర్.బి.ఐ డైరెక్టర్ గా చెయ్యమని మీ నాయన సిఫార్సు లేఖ ఎందుకు రాశాడు. నీ ఆర్ధిక అక్రమాలను కప్పి పెట్టడానికే కదా. దీన్ని గురించి ఏమి చెబుతావు.
58. వివిధ జాతీయ బ్యాంకు లలో సాయి రెడ్డి ని డైరెక్టర్ గా నియమించడానికి నీ తండ్రి సిఫార్సు లేఖ ఎందుకు రాశాడు, ఆ బ్యాంక్స్ నుండి వీలైనంత సొమ్మును ఆంధ్ర లో ప్రభుత్వ భూములు ను కంపెనీల ద్వారా దోచడానికే కదా?
59. కేంద్రం చేతిలో పావుగా సిబిఐ మారింది అని విమర్శించే వాడివి, సిబిఐ కి స్వయం ప్రతిపత్తి గురించి ఎందుకు మాట్లాడవు, నీ రంగు మరింత బయట పడుతుందనేనా!
60. నీ సరస్వతి పవర్ కు గుంటూరు లో 1500 ఎకరాల సున్నపురాయి (రూ 1.5 లక్షల కోట్లు) లీజు ఎలా వచ్చింది? నువ్వు ముఖ్య మంత్రి కొడుకువి అనే కదా? నీ కన్నా ముందే అప్లై చేసిన వాళ్ళకు ఎందుకు రాలేదు?
61. వైఎస్ అవినీతి నిర్ణయాలలో మంత్రుల ది కూడా భాగ స్వామ్యం వుంది అని కోర్ట్ కి వెళ్లి, ఆ మంత్రులనే నీ పార్టీ లోకి చేర్చుకొని టికెట్స్ ఇవ్వడం అంటే నీ నాయన అవినీతి ని ఒప్పుకున్నట్టే కదా?
62. నీ చెల్లెమ్మ కి 11 కంపెనీలు ఉన్నాయి, 6 కంపెనీలలో డైరెక్టర్ గా ఉండి, ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయి చెప్పగలవా? సగం రాష్ట్రాన్ని నీ చెల్లి కి ఆడపడుచు కట్నం గా ఇవ్వడానికి నీ కేమి హక్కు వుంది?
63. నీ బావకి అన్ని కంపెనీలు, ఖరీదైన ఫ్లైట్స్, వేల కోట్ల ఆస్తులు గత పదేళ్ల లో ఎలా వచ్చాయి, ఆగస్టా హెలికాప్టర్ ల కుంభకోణం నీ బావ చలవే కదా.
64. వైఎస్ పాలనలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సెజ్‌ ల కోసం దాదాపు లక్ష ఎకరాలను పంచిపెట్టారు, ఇదే మన్న నీ తాత ముల్లా?
65. నీకు, నీ మిత్రుడు గాలి కంపెనీల కు కోల్ కత్తా లోని అల్లి బిల్లి కంపెనీల నుండి నిధులు హవాలా మార్గం లో రావడం నిజమే కదా? దీనికి సమాధానమేమీ? ఈడి కూడా ఇదే నిర్ధారించింది కదా!
66. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డు పెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేల కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టుకుంది నిజం కాదా?
67. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు లో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా మీ పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధి పొందారు, నీకెంత వాటా దక్కింది దీనిలో?
68. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం ముషీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు, వాళ్ళంతా నీ బినామీ లే కదా.
69. భూముల కేటాయింపులు జరిగిన తేదీలు, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన తేదీలను చూస్తే వాటిని పెట్టుబడులు అని కాకుండా లంచాలు అని నిర్దారించవచ్చు. పెట్టుబడుల రూపంలో చెల్లించి నవన్నీ లంచాలే”- అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది, దేనికి ఏమంటావ్?
70. తన కుమారుడు జగన్మోహనరెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిగా అన్ని నిబంధనలనూ తుంగ లో తొక్కి వైఎస్ ప్రభుత్వం అరబిందో ఫార్మా, హెటేరో గ్రూప్ కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూర్చిందని జగన్ అక్రమాస్తుల కేసులో తొలి జప్తుపై ఇచ్చిన తీర్పులో న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. దేనికి ఏమంటావ్?
71. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలను నాశనం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా?
72. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ టీడీపీ హయాంలో బిల్ క్లింటన్ పక్కన కూర్చొంటే వైఎస్ హయాంలో జైల్లో కూర్చొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కోర్టు, జైలు, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
73. మీ నాన్నలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే బంగారు కుర్చీ, బంగారు పళ్ళాలు గాలి జనార్దనరెడ్డికి వచ్చేవా..?
74. జగన్ అమాయకుడు అయితే 16 నెలలు బంధించాల్సిన చట్టాలు ఉంటాయా..? దీనిపై చర్చకి సిద్దమా?
75. వైజాగ్ లో రాంకీ ఫార్మా సిటీ వ్యవహారం లో 914 ఎకరాలు అక్రమం గా అమ్ముకొని 130 కోట్లు లాభం పొందారు, వీటి అసలు విలువ ఇప్పుడు 5000 కోట్లకు ఫైనే కదా! ఈ డబ్బు ను సాక్షి లో పెట్టుబడి పెట్టారని సిబిఐ తేల్చింది. దీనికి సమాధానమేమీ?
76. రాంకీ గ్రీన్‌ బెల్ట్‌ ఏరియాను 250 మీటర్ల నుంచి 50 మీటర్లు తగ్గించి ఆ సంస్థకు 914 ఎకరాలు ప్రయోజనం చేకూర్చారు. వీళ్లే జగతిలో 10 రూపాయలు విలువైన ఒక్కో షేరును రాంకీకి చెందిన ఇఆర్‌ఇఎస్‌టీడబ్ల్యు సంస్థ కొనుగోలు చేయడం ద్వారా 9.99 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తేల్చింది. ఇందులో నిజం లేదా?
77. పరవాడలో రాంకీ సంస్థ ఏర్పాటు చేసిన ఫార్మాసిటీకి రిజిస్ట్రేషన్‌ ఫీజు స్టాంపు డ్యూటీ కింద ఖర్చు అయిన 3.10 కోట్లను వెనక్కి చెల్లించేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది వైఎస్‌ కాదా?
78. జీవో నెం.54 ద్వారా కడప జిల్లాలో 1562 ఎకరాలు భారతీ సిమెంట్స్‌ 30ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన మాట నిజమే కదా? ఈ సంస్థలో దాల్మియా సిమెంట్‌ రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ నిర్ధారించడం వాస్తవమే కదా?
79. జీవో నెం.305 ద్వారా కడపలో 2037 ఎకరాలు లైమ్‌స్టోన్‌ భూములను రఘురాం సిమెంట్స్‌కు ధారాదత్తం చేసింది వైఎస్‌ కాదా?
80. 2005లో రఘురామ్‌ సిమెంట్‌ను జగన్‌ దక్కించుకుని తరవాత 2006లో భారతీ సిమెంట్‌గా పేరు మార్చి కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో 2037.52 ఎకరాల సున్నపు గనులను కేటాయింపజేసుకొన్నట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఇది వాస్తవం కాదా?
81. జీవో నెం.25 ఆధారంగా – పెన్నా సిమెంట్‌కు తాండూరులో 822 ఎకరాలు లైమ్‌స్టోన్‌ క్వారీలను కేటాయిస్తూ జీవో నెం.76 జారీ చేసింది వైఎస్‌ కాదా?
82. జీవో నెం,1490 ద్వారా అనంతపురం జిల్లాలో 231.91 ఎకరాల భూమిని పెన్నా సిమెంట్స్‌కి బదలాయించిది వైఎస్‌ కాదా?
83. జీవో నెం.865 కడపలోని ఇండియా సిమెంట్స్‌కి 60 ఎకరాల భూమి లీజు పొడిగించి ఇండియా సిమెంట్స్‌కు రోజుకు పది లక్షల గ్యాలన్ల నీరు కేటాయించింది వైఎస్‌ కాదా?
84. జీవో నెం.1110 ద్వారా ప్రకాశం జిల్లాలోని 6406 ఎకరాల భూమిని వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు కేటాయించింది వైఎస్‌ కాదా? జీవో నెం.1115 ద్వారా వాన్‌పిక్‌ కోసం గుంటూరు జిల్లాలో 5451 ఎకరాల భూమిని బదలాయించిది వైఎస్‌ కాదా?
85. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు పైగా భూములు కేటాయించినందుకే నిమ్మగడ్డ ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో 854.50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని సీబీఐ నిగ్గు తేల్చింది. ఇది వాస్తవం కాదా?
86. అక్రమ లావాదేవీలున్న కంపెనీలతోపాటు 12 బ్రీఫ్‌కేస్‌ కంపెనీలపైనా, విదేశాల నుంచి మీ సంస్థల్లోకి వచ్చిన సొమ్ముపైనా ఎటువంటి విచారణ జరపకుండా బెయిల్‌ ఎలా దక్కించుకున్నారు?
87. కార్మెల్‌ ఏషియాలో క్విడ్‌ ప్రోకో వ్యవహారం ఉందని 4, 6, 8, 9 ఛార్జ్‌షీట్స్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. మరి 23.9.2013న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వస్తున్న రోజే కార్మెల్‌ ఏషియాలో అసలు క్విడ్‌ ప్రోకో లేదని సీబీఐ మెమోలో పచ్చి అబద్ధం చెప్పించడం వెనక కాంగ్రెస్‌తో కుమ్మక్కు కారణం కాదా?
88. జడ్చర్లలో హెటిరో, అరబిందో కంపెనీలు ఒక్కోదానికీ 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలు కేటాయించినందుకు ప్రతిఫలంగా సాక్షిలో అరవిందో 10 కోట్లు, హెటిరో 19.50 కోట్లు పెట్టుబడులు పెట్టాయని సీబీఐ మొదటి ఛార్జిషీట్‌లో చెప్పింది. ఇది నిజమే కదా?
89. మీ జగతిలో టీఆర్‌ కన్నన్‌ రూ.5 కోట్లు, మాధవ్‌ రామచంద్ర రూ.19.65 కోట్లు, ఎ.కె.దండమూడి రూ.10 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆ తరవాత వారిని బెదిరించినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడి చేసిన మాట వాస్తవం కాదా?
90. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ అక్రమాలు చేయలేదని షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ లు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా?
91. అనిల్ వ్యాపార భాగస్వామి, బెనెటా కంపెనీ ఎండీ కొండలరావు వద్ద పనిచేస్తున్న వీరభద్రా రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించడం వెనుక బ్రదర్ అనిల్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానం ఏమిటి? ఇదంతా బయ్యారం గనుల గురించే కదా?
92. సాక్షి పత్రిక, ఛానల్ నష్టాలలో వున్నా కూడా జీతాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? నీ బ్లాక్ మనీ అంతా సాక్షి లో తోసేసి, సాక్షి పత్రిక కి లాభాలు వస్తున్నాయి అని మభ్య పెడుతున్నారా?
93. నెల్లూరు లోని కృష్ణ పట్నం పోర్ట్ సెజ్ లో భాగం గా 5000 ఎకరాలు ప్రభుత్వ భూములు తెరగా కొట్టేసింది నీ బినామీలే కదా?
94. కృష్ణ పట్నం పోర్ట్ సెజ్ భూములని తాకట్టు పెట్టి నవయుగ గ్రూప్ రూ1050 కోట్లు బ్యాంక్స్ నుండి ఋణం తీసుకోవడం నిజం కాదా? ఆ డబ్బులు ఇప్పడు ఎక్కడ ఉన్నాయి? ఎవరికీ చేరాయి? నీకెంత ముట్టింది? కనీసం నువ్వైనా చెప్పగలవా?
95. వీటికి ప్రతిఫలం గానే నవయుగ గ్రూప్ కు చెందిన ఈశాన్య భారత్ లోని హైడల్ పవర్ ప్లాంట్ ను నువ్వు, నీ కుటుంబం, నీ బినామీ లు కొట్టెయ్యడం నిజమే కదా! వీటిని ఆడిటర్ లు కూడా నిర్ధారించారు కదా! ఆ రిపోర్ట్ ను నీ పత్రిక లో ప్రచురించే దమ్ముందా?
96. నవయుగ గ్రూప్ కు సంబంధించిన కృష్ణ పట్నం పోర్ట్, సెజ్, మచిలీ పట్నం పోర్ట్, విద్యుత్ ప్లాంట్స్, వీటితో నీ అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ వనరుల దుర్వినియోగం మీద సిబిఐ విచారణకు సిద్దమేనా?
97. విలువలు గురించి మాట్లాడే నువ్వు, ఇడుపులపాయలో నీ కుటుంబం అసైన్డ్ భూములు అనుభవించడం నిజం కాదా? మీ నాన్నే ఒప్పుకున్నాడు కదా. ఇప్పటికీ అక్కడ 2000 ఎకరాలు నీ కుటుంబం, కంపెనీల పేరు మీదే ఉన్నాయి కదా? వాటిని ప్రభుత్వానికి ఇచ్చేయ్యగలవా?
98. విదేశాలనుండి, లండన్, లక్సంబర్గ్‌, సింగపూర్, మారిషస్, దుబాయ్ నుండి నీ కంపెనీలలో కి వచ్చిన పెట్టుబడుల గురించి ఏమి చేప్తావు, అవన్నీ కూడా నీ అవినీతి సొమ్మే కదా, సిబిఐ కూడా అదే చెప్పింది కదా? నీ నల్ల డబ్బు ని తెల్ల గా మారుస్తున్నావు కదా?
99. ఇంకా ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే నీ ధన దాహం తీరుతుంది? ఒక్క కుటుంబానికి 10 లక్షల కోట్లు అవసరమా, ఈ డబ్బుతో ఆంధ్ర నిర్మాణాన్ని అద్భుతం గా చేయొచ్చు కదా!
100. నీకున్న రాజమహల్ లను (కడప, హైదరాబాద్, బెంగళూరు, జోధపుర్, ఢిల్లీ) చూడడానికి, మీడియా ను అనుమతించే దమ్ము ఉందా?
101. రాష్ట్రం మొత్తం మీద క్రిస్టియన్ మెషినరీ ఆస్తులు, భూములు దోచుకున్న ది నీ కుటుంబమే (బావ అనిల్, మామ రవీంద్ర నాధ్) కదా, వీటి మీద సిబిఐ విచారణకు సిద్దమా? అంత దమ్ము దైర్యం ఉందా?
102. అక్రమాస్తుల కేసులో నీ ఒక్కరికే బెయిల్ వచ్చి, మరెవరికీ బెయిల్ రాకపోవడానికి కారణం ఏమిటి, ఒకే కేసులో ఇదెలా సాధ్యం?
103. ప్లూరి ఎమర్జింగ్, 2ఐ కాపిటల్ నీ బినామీ లే కదా, నీ కాంపౌండ్ కుక్క అయిన సాయి రెడ్డి ఈ కంపెనీలో డైరెక్టర్ కాదా? వీటి నుండే ఇండియా లోని నీ కంపెనీలకు ( సండుర్ పవర్), అక్కడ నుండి నీ వ్యాపార సామ్రాజ్యానికి పెట్టుబడులు వచ్చాయి? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా.
104. నీ అక్రమ వ్యాపారాల మీద, అవినీతి మీద పరిశోధన చేసే దమ్ము, దైర్యం, తెలివి, నీ మీడియా కు ఉందా?
105. నీ కంపెనీల వాటా (సండుర్) ఎక్కువ ధరకు కొన్ని కంపెనీలకు ( చెన్నై కంపెనీలు) అమ్మి, అవే కంపెనీలను కారు చవకగా మరో సాయి రెడ్డి కంపెనీ (కీలాన్) చేత కొనిపించి, ఈ కంపెనీని నువ్వు కారు చవకగా హస్త గతం చేసుకోవడం మాకు తెలియదా? ఇలా నీ నల్ల డబ్బు ని తెల్ల గా మార్చుకోవడం నిజం కాదా? సిబిఐ కూడా ఇదే చెప్పింది కదా.
106. కోస్తా ప్రాంతం లో… శ్రీకాకుళం బీచ్ సాండ్స్ – 8000 కోట్లు, వి.వి. మినరల్స్ -2000 కోట్లు, వంతాడ లాటరిటే -1000 కోట్లు, వైట్ ఫీల్డ్ సెజ్ -100 కోట్లు, కాకినాడ సెజ్, పోర్ట్ – 5000 కోట్లు, వాన్ పిక్ -20000 కోట్లు, మిడ్ వెస్ట్ గ్రానైట్ -10000 కోట్లు ,
మంగం పేట -1000 కోట్లు, సరస్వతి పవర్ – 30000 కోట్లు, భారతి సిమెంట్ -6000 కోట్లు, నెల్లూరు లో పవర్ ప్లాంట్స్, భూములు, ఎయిర్ పోర్ట్ – 30000 కోట్లు, ఆన్ రాక్ అల్యూమినియం – 100000 కోట్లు లాంటివి నీ అవినీతి సామ్రాజ్యానికి మచ్చు తునకలే కదా.
107. సర్కారీ ఉత్తర్వులు, కనీస అవగాహన పత్రాలు సైతం లేకుండానే ‘నీకిది నాకది’ పంథాలో రాష్ట్రం సొంత జాగీరు అయినట్లుగా వేల ఎకరాల్ని అస్మదీయులకు వైఎస్‌ ఎలా రాసిచ్చేశారో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ బాగోతం నిర్ద్వంద్వంగా చాటుతోంది, దీనిని కాదనే దైర్యం ఉందా?
108. అచిర కాలంలోనే అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు?’- సర్వోన్నత న్యాయస్థానం జగన్‌కు వేసిన సూటి ప్రశ్న అది, దీనికి సమాధానం చెప్పే నైతిక విలువలు నీకున్నాయా?
109. వైఎస్‌ తన ఏలుబడిలో దాదాపు లక్ష ఎకరాల సంతర్పణలతో- జగన్‌ను నడమంత్రపు సిరిమంతుణ్ని చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట జనం కళ్లకు గంతలు కట్టి, గుట్టుచప్పుడు కాకుండా జగన్‌ సంస్థల్లోకి పెట్టుబడుల రూపేణా లంచాలు రాబట్టి, కనీవినీ ఎరుగని అవినీతి మహా సామ్రాజ్యాన్నే నిర్మించారు. దీనికే మంటావు?
110. నిజాయతీ పరుడైన అధికారిని పక్కకు తప్పించి, జగన్‌తో కుమ్మక్కై కేసుల్ని నీరుగారుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఈ పాపంలో భాగం లేదా? నీ బెయిల్ కోసం 1200 కోట్లు ఇచ్చింది నిజం కాదా?
111. 2003-’04లో జగన్‌ చెల్లించిన పన్ను పట్టుమని మూడు లక్షల రూపాయలైనా లేదు. 2010-’11 నాటికి వార్షికాదాయం రూ.500కోట్లుగా లెక్క గట్టి, ఆరు నెలల కాలానికి రూ.84కోట్లు పన్ను చెల్లించేటంత స్థోమత జగన్‌కు ఎలా దఖలుపడిందో?
112. రాయలసీమ ప్రాంతం లో: బ్రాహ్మణి స్టీల్ -2000 కోట్లు, ఓబులాపురం మైన్స్- 20000 కోట్లు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ – 2000 కోట్లు, పెన్నా సిమెంట్స్ – 3000 కోట్లు, శ్రీ సిటీ -4000 కోట్లు, భారతి సిమెంట్స్ – 6000 కోట్లు, మంగం పేట గనులు – 2000 కోట్లు లాంటివి కరువు సీమ, ఖనిజాల గని రాయలసీమ లో నీ అవినీతి సామ్రాజ్యానికి ఒక చిన్న భాగమే కదా?
113. సాక్షి తో సహా, ఎన్.టివి. టివి 5 లాంటివి నీ బినామీ లే కదా? తుమ్మల నరేంద్ర, నిమ్మగడ్డ, నాగార్జున, కెవిపి నీ కాంపౌండ్ లో కుక్కలే కదా? నీ ఛానల్ చూడటం లేదని, వీటిని అరువు తెచ్చుకోవడం నిజం కాదా, దొంగ సర్వే లు ప్రసారం చెయ్యడానికి 40 కోట్లు ఖర్చు పెట్టడం నిజమే కదా, దీనికైనా సమాధానం ఉందా?
114. మీ కుటుంబ లెక్కలు చూసే ఛార్టెడ్ అకౌంటెంటు విజయసాయిరెడ్డికి అర్హత లేకున్నా ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా నియమించి మీరు ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా అనేక విషయాలు దాచిపెట్టి అతన్ని రిజర్వు బ్యాంకు డైరెక్టర్ గా నియమించేందుకు సిఫార్సు చేశారు. సొంత వారిని అందలం ఎక్కించడం భావ్యమా?
115. మీ శిష్యుడు సునీల్ రెడ్డి పేదరికంతో అల్లాడిన దిగువ మధ్యతరగతి యువకుడు. అలాంటి వ్యక్త కోట్లకు పడగలెత్తాడు అంటే మీ చలువ కాదా? పులివెందుల ప్రజలు అతని పురోగతి చూసి నివ్వెర పోవట్లేద


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: