పవన్ కు పోసాని సవాల్.. చేతనైతే రోడ్డుపైకి రా...!!

Shyam Rao

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అననతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విషయం అందరికీ విదితమే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని నాన్చడం తో ఆ రెండు ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం ఆపనని పవన్ ప్రతిన బూనిన విషయం కూడా తెలిసిందే. అయితే ..



ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ గురించి తమకు బాగా తెలుసని, దేశం మీద, ప్రజల మీద ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే.. అన్నీ వదిలేసి రోడ్డుపైకి రావాలని అన్నారు. ఆయన ఇంకా పరిపూర్ణమైన రాజకీయాల్లోకి రాకముందే, వాళ్లు తిట్టడం.. వీళ్లు తిట్టుకోవడం వేస్ట్ అంటున్నాను. రాజకీయాల్లోకి క్లియర్ గా రావాలనుకుంటున్నప్పుడు అంతే క్లీన్ గా ఉండాలనేది నా కోరిక. పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. ఈ వన్ ఇయర్, ఆర్నెల్లు.. సినిమాలు పక్కన పెట్టి.. ట్విట్టర్లు పక్కన పెట్టి.. జనసేన పార్టీ కండువా వేసుకుని చంద్రబాబును ఏకి పారేయండి’ అని పోసాని సలహా ఇచ్చారు.



ఎన్టీఆర్ లా ఊరూరు తిరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఏపీకి తీవ్రమైన అన్యాయం ఏమీ చేయలేదు... ప్రత్యేక హోదా విషయమై ప్రజలను ఆయన ఎందుకు రెచ్చగొట్టడం? చంద్రబాబు వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి ఏపీకి ప్రత్యేక హోదా విషయమై అడిగాడా? అని నేను ప్రశ్నిస్తున్నానన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: