పల్లీల పొట్లాలన్నీ కొనేసిన యువతి.. అసలు విషయం తెలిసి అందరూ షాక్?

praveen
సాధారణంగా విమానంలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలను అందించడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో ఆహార పదార్థాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఒకరు తినే ఆహారం మరొకరికి కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. విమానంలో  ప్రయాణికులకి పల్లీలు అందించడం మొదలుపెట్టారు విమాన సిబ్బంది. కానీ ఓ యువతికి మాత్రం పల్లీలు పడవు. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


 కాస్త వివరాల్లోకి వెళితే.. వియా విలియమ్స్ అనే యువతి బిజినెస్ ట్రిప్ కోసం గత నెలలో లండన్ నుంచి జర్మనీకి వెళ్లి వచ్చింది. అయితే ఆమెకు పల్లీలు పడకపోవడంతో ప్రయాణంలో ఊహించని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తొలుత జర్మనీ వెళ్ళేటప్పుడు ఆమె తనకున్న ఎలర్జీ విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి చెప్పింది. దీంతో వారు ఎవరికి పల్లీలు ఇవ్వబోము అంటూ స్పష్టం చేశారు. ఇతర ప్రయాణికులు కూడా యువతి పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోయారు. కానీ తిరుగు ప్రయాణంలో ఆమెకి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.


 యూరో వింగ్స్ విమానంలో ఆమె తిరుగు ప్రయాణమైంది. తన సమస్య గురించి చెప్పిన అటు విమాన సిబ్బంది పట్టించుకోలేదు. విమానంలో మిగతా ప్రయాణికులకు పల్లీలు సర్వ్ చేయడం మొదలుపెట్టారు. అలా చేయకుండా ఉండడం రూల్స్ కి విరుద్ధం అంటూ ఆమెకు బదులు ఇచ్చారు. అయితే ఆ యువతి  షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విమానంలో పల్లి ప్యాకెట్లను ఎవరు తెరవకుండా ఉండేందుకు అన్ని పల్లీల తానే కొనుక్కుంటాను అంటూ చెప్పింది. ఎంత ఖరీదైన పర్వాలేదు అంటూ తెలిపింది. దీంతో యువతీ పట్టు పడడంతో సిబ్బంది కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది  తర్వాత ప్యాకెట్లన్నీ ఒక సంచిలో కట్టి మూలన పెట్టేస్తారు. అయితే ఈ ప్రయాణం తర్వాత తనకు ఈ పరిస్థితిని కల్పించినందుకు యూరో వింగ్స్ వారు సిగ్గుపడాలి అంటూఎయిర్ లైన్స్ పై ఘాటు విమర్శలు చేసింది బాధిత యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: