రాత్రి 10 దాటితే వేడుకలు బంద్.. షాక్ ఇచ్చిన ప్రభుత్వం?
వీలైనంత ఎక్కువగా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవు ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇస్లామాబాద్ నగరంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత వివాహ వేడుకలు జరగడానికి వీలు లేదు అంటూ తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఇక మరోవైపు పాకిస్థాన్లో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని తెలుస్తోంది. దీంతో ఇక పెళ్ళిళ్ళ పై నిషేధం నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలంటూ అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఇక ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే చమురు గ్యాస్ కు కొనేందుకు తమ వద్ద డబ్బులు లేవని ఇప్పటికే ప్రభుత్వం సోషల్ మీడియాలో తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇలా చమురు గ్యాస్ కొరత కూడా ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి జనాలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారంలోకి వచ్చిన శాబాజ్ షరీఫ్ గవర్నమెంట్ పరిస్థితులను ఎలా అదుపులోకి తీసుకోస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది..