రష్యా రసాయన దాడి.. నిజమేనా?
ఒక మరి కొంత భూభాగం రష్యా హస్తగతం అయిందంటే ఇక ఉక్రెయిన్ పూర్తిగా ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకోబోతుంది అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్న మాట. ఇక గత రెండు రోజుల నుంచి మరియపోల్ దగ్గర రష్యా దాడి తీవ్రంగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ దాడులపై ఇన్వెస్టిగేషన్ కి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఎలాగైనా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి మరియపోల్ ను స్వాధీనం చేసుకోవాలని కంకణం కట్టుకున్న రష్యా అక్కడా రసాయన దాడికి దిగింది అంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
మానవ రహిత విమానం ద్వారా రసాయినిక దాడికి పాల్పడింది అంటూ ఉక్రెయిన్ లోని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇలా మానవ రహిత విమానం ద్వారా విష పదార్థాలను రష్యా సైన్యం జారవిడిచిందని సమాచారం. ఈ మేరకు ఇక విచారణ కొనసాగిస్తున్నారు. సైనిక స్థావరాలు పౌర ఆవాసాలు లక్ష్యం గా ఇక ఈ రసాయనిక దాడి జరిగింది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఊపిరి తీసుకోవడం లో ఎంతో మంది ఇబ్బంది పడ్డారట. ఈ క్రమం లోనె ఇక దీని పై జరుగుతున్న విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.