అవసరమైతే టైటిల్ వదులుకుంటా అంటున్న అలీ రెజా..!
ఈ టాస్క్లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. పునర్నవిని సంచాలకులుగా నియమించారు. టాస్క్ ప్రకారం ట్యాప్ల నుండి నీళ్లు పట్టుకొని గ్లాస్ టబ్ లో నింపాల్సివుంటుంది. గేమ్లో లేని రాహుల్, మహేష్, వరుణ్లు తమకు నచ్చిన వాళ్లకు సాయం చేయొచ్చని చెప్పారు.అలీ తన గేమ్ తను ఆడకుండా.. తన అక్క శివజ్యోతికి హెల్ప్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి. నీ ఆట నువ్ ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి? ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అంటే అవును వదిలేస్తా అన్నాడు అలీ.
దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు. దీంతో సంచాలకులుగా ఉన్న పునర్నవి వివాదంలో కల్పించుకొని అలీ కు గేమ్ ఆడాలని సూచించింది...కానీ ఆలీ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉండటంతో ఎవరు ఏం మాట్లాడలేక అందరూ బిగ్ బాస్ కి కంప్లీట్ చేయగా..వెంటనే బిగ్ బాస్ కల్పించుకుని..అలీ రెజా, శివ జ్యోతి ఇద్దరు ఆడిన గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని వారిద్దరిని టాస్క్ ఆడకూడదని చెప్పడం జరిగింది. దీంతో ఈ కులాయి కొట్లాట ఆటలో చివరాకరికి వితిక విన్నర్ గా నిలిచింది.