టాలీవుడ్, కోలీవుడ్ లో అప్పట్లో యాక్షన్, లవ్ సినిమాల్లో నటించిన హీరో ప్రశాంత తర్వాత వరుస అపజయాలతో సిని పరిశ్రమకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘వినయ విధేయరామ’సినిమాలో కనిపించాడు. ఇక బాలీవుడ్ లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా 'అంధాదున్' తెరకెక్కించారు. ఈ మూవీలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించగా టబు ఓ కీలక పాత్రలో కనిపించింది. అంధాదున్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడమే కాకుండా మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులను గెలుచుకుంది. దీంతో సినిమా రీమేక్ రైట్స్ పై ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది. అన్ని పోటీల మద్య ఈ మూవీని తమిళంలో సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన త్యాగరాజన్ శివనందం దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ ప్రశాంత్ హీరోగా తమిళంలో రిమేక్ చేస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే..హీరో అంధుడైన ఓ పియానో ప్లేయ . అంధుడైనప్పటికీ మిగతా జ్ఞానేంద్రియాల సహకారంతో తన జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాడు. ఈ హీరోకి ఓ ప్రేమికురాలు ఉంటుంది..అంతా సాఫీగా సాగిపోతున్న ఈ హీరో జీవితంలో మరో స్త్రీ ప్రవేశిస్తుంది. అంతేకాదు హీరో జీవితాన్నే ఓ మలుపు తిప్పుతుంది. ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? హత్య చేసిన వ్యక్తిని హీరో ఎలా గుర్తించి చట్టానికి పట్టిస్తాడు అనేదే సినీ కాన్నెప్ట్.
ఈ మూవీ పూర్తిగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో తన తనయుడినే హీరోగా తీసుకుంటున్న త్యాగరాజన్ పై కొన్ని విమర్శలు వినిపించాయట. ప్రశాంత్ ఇప్పటికే ఫేడవుట్ హీరో అని..చాలా లావుగా ఉన్నాడని ఎలా హీరోగా పనికి వస్తాడని కామెంట్స్ వినిపించాయట. కాగా, తమిళ్ అంధాదున్ లో బ్లైండ్ హీరో పాత్ర కోసం ప్రశాంత్ చాలా వరకు మారడానికి చాలా కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ప్రశాంత్ ఇప్పుడు అంధాదున్ సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గినట్లు త్యాగరాజన్ చెప్పారు. ఏడాది సంక్రాంతి కి రిలీజైన వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలి.