సరోగసీ ద్వారా తల్లైన ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్!

siri Madhukar
బాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు.  90వ దశకంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జితేంద్ర కూతురు ఏక్తా కపూర్ మాత్రం టివి, సినిమా ప్రొడ్యూసర్ రాణిస్తూ..పలు సినిమాలు, టీవి సీరియల్స్ కి దర్శకత్వం వహించారు.  బాలీవుడ్ లో ఏక్తా కపూర్ పలు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చింది. 

తాజాగా ఏక్తా కపూర్ తల్లయింది.  సరోగసీ ద్వారా ఓ మగ బిడ్డకు ఆమె తల్లి కావడం విశేషం. జనవరి 27న బాబు పుట్టాడని, తొందర్లోనే ఆ చిన్నారిని ఇంటికి తీసుకురానున్నట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. గతంలో ఆమె సోదరుడు, నటుడు తుషార్‌ కపూర్‌ కూడా సరోగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు జితేంద్ర సంతానమైన ఈ ఇద్దరూ అద్దె గర్భం ద్వారా పిల్లలను పొందడం విశేషం.

ప్రస్తుతం ఏక్తాకపూర్‌, టివి షో కసౌతి జిందగీ కే పునర్నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. దీంతోపాటు నాగిన్ సీజన్ 3, దిల్ హీ తో హై, ఖయామత్ కీ రాత్ అనే టీవీ షోలను ప్రొడ్యూస్ చేస్తున్నది. ఈ మధ్యే వీరె ది వెడ్డింగ్, లైలా మజ్ను మూవీలను ఏక్తా నిర్మించారు. గతంలో  ఏక్తా కపూర్ డేటింగ్ (సహజీవనం) పై పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: