ఫిలిం జర్నలిస్టుగా మారిపోయిన మహేష్ !

Seetha Sailaja
టాలీవుడ్ ప్రిన్స్ గా లక్షలాది మంది అభిమానులు కలిగిన మహేష్ ఇప్పుడు తన రూట్ మార్చి ఫిలిం జర్నలిస్టుగా మారి వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని  కలిగిస్తోంది. అంతేకాదు మరి కొందరైతే మహేష్ ట్విటర్ లో ఫిలిం జర్నలిస్టుగా మారిపోయాడు అంటూ జోక్స్ కూడ వేస్తున్నారు. 

మహేష్ పై ఈ తరహా కామెంట్స్ రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో మహేష్ విడుదల అవుతున్న లేటెస్ట్ సినిమాల పై చేస్తున్న కామెంట్స్ అని అంటున్నారు. ఆమధ్య విడుదలైన మణిరత్నం ‘నవాబ్’ ను విపరీతంగా ప్రశంసించిన మహేష్ ఆతరువాత ‘బిగ్ బాస్ 2’ షో విన్నర్ గా కౌశల్ ఎంపిక అయినందుకు అందరి టాప్ హీరోలు అందరి కంటే ముందుగా కౌశల్ ను అభినందించాడు. 

ఇది చాలదు అన్నట్లుగా మహేష్ రాజమౌళి పుట్టినరోజునాడు అదేవిధంగా శంకర్ ‘2.0’ ట్రైలర్ పైనా ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రతి పండుగకు తన అభిమానులకు తన ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ తాను అందరి వాడిని అని మహేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఈమధ్య కాలంలో మహేష్ ట్విటర్ లో స్పందించినంత ఎక్కువ సార్లు చాలమంది టాప్ హీరోలు కూడ స్పందించలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ ప్రవర్తన వల్ల ప్రస్తుతం మహేష్ కు ట్విటర్ లో 7మిలియన్స్ ఫాలోయర్స్ ఏర్పడ్డారా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. ఆమధ్య వచ్చిన వరస పరాజయాలతో బెంబేలు పడిపోయిన మహేష్ ‘భరత్ అనే నేను’ తో తిరిగి సక్సస్ ట్రాక్ లోకి వచ్చిన నేపధ్యంలో వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘మహర్షి’ విషయంలో ఎలాంటి నెగిటివ్ ప్రచారం జరగకుండా తాను అందరి వాడిని అని తెలియచేసేలా మహేష్ ఫిలిం జర్నలిస్టు అవతారం ఎత్తాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: