నాగార్జున మాటలలో వర్మ షాడో !

Seetha Sailaja
నాగార్జున రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో వచ్చిన ‘ఆఫీసర్’ ఘోరపరాజయం చెందడంతో నాగార్జున ఇక వర్మ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాడు అని భావించారు. అయితే నాగ్ నోటివెంట వర్మ గురించి మాటలు రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈఆసక్తికర సంఘటన నిన్న నాగార్జున ‘చి.ల.సౌ’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిర్వహించిన మీడియా మీట్ లో జరిగింది. 

తనకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాలు గురించి మాట్లాడుతూ నాగ్ వర్మ ప్రస్తావన తీసుకువచ్చాడు. ఒకప్పుడు తాను బాలీవుడ్ లో సినిమాలు చేసే రోజులలో తనను బాలీవుడ్ కు వచ్చేయమని వర్మ తన పై ఒత్తిడి చేసిన విషయాన్ని వివరిస్తూ తనకు రెండు పడవల పై ప్రయాణం చేయడం ఇష్టంలేక తాను రామ్ గోపాల్ వర్మ సలహాలను తిరస్కరించాను అంటూ అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెట్టాడు. 

ప్రస్తుతం తాను లేటెస్ట్ గా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ గురించి మాట్లాడుతూ ఆ అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చిందే తప్ప తాను ప్రయత్నించలేదని నాగ్ కామెంట్స్ చేసాడు. ఈ చిత్రంలో తాను 15 నిమిషాలు కనిపిస్తానని కానీ ఆ రోల్ చాలా ప్రత్యేకమైందని అంటూ తన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ గురించి అంచనాలు పెంచాడు నాగార్జున. ఇది ఇలా ఉండగా నాగ్ రూట్ మార్చి తన మనసు ఈసారి సీక్వెల్స్ పై పెడుతున్నట్లు తెలుస్తోంది. 

ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒకేసారి నాగార్జున నిన్నటి మీడియా మీట్ లో రెండు సినిమా సీక్వెల్స్ గురించి మాట్లాడాడు. ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ కు కథ రెడీ అయిందని ఒకనాటి పాపులర్ రచయిత సత్యానంద్ ఈమూవీ కథకు తుది మెరుగులు దిద్దు తున్న విషయాన్ని బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం నానీతో నటిస్తున్న ‘దేవదాస్’ హిట్ అయితే ఆమూవీకి సీక్వెల్ చేసే ఉద్దేశ్యం ఉందని అంటూ ఆమూవీ రిజల్ట్ పై తన నిర్ణయం ఉంటుంది అని అంటున్నాడు. దీనితో ఇలా వరస సీక్వెల్స్ చేసుకుంటూ నాగార్జున సీక్వెల్స్ హీరోగా మారిపోతాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: