నితిన్ ఒత్తిడి లో ఇరుక్కున్న పవన్ !

Seetha Sailaja
‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల వైపు మళ్ళడంతో ప్రస్తుతం పవన్ కు సంబంధించిన వార్తలు అన్నీ రాజకీయ నేపధ్యంలోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ ఎన్నికలు అయ్యే వరకు సినిమాలు చేసే అవకాశం లేదు అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. 

అయితే పవన్ ఒక మూవీ ప్రమోషన్ ఫంక్షన్ కు అతిధిగా రావలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. పవన్ త్రివిక్రమ్ తో కలిసి కొన్ని చిన్న సినిమాలు తీయాలి అన్న ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ అన్న బ్యానర్ ను పెట్టిన విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాకు పవన్ త్రివిక్రమ్ లు నిర్మాతలు

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈసినిమాను నిర్మించారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరో నాలుగు రోజులలో జరగబోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి హైక్ తీసుకు రావాలి అంటే ఈమూవీ ఫంక్షన్ కు పవన్ అతిధిగా రావలసిందే అని నితిన్ పట్టు పడుతున్నట్లు టాక్. పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా పరిగణింపబడే నితిన్ పట్ల పవన్ కు ప్రత్యేక అభిమానం ఉంది. 

అయితే ప్రస్తుతం క్షణం తీరికలేని రాజకీయాలలో తలములకలై ఉన్న నేపధ్యంలో తాను ఈ ఫంక్షన్ కు రాలేనని పవన్ చెపుతున్నట్లు టాక్. అయితే త్రివిక్రమ్ మాత్రం ఈ ఫంక్షన్ కు పవన్ అతిధిగా వస్తే తిరిగి ఫిలిం ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యే అవకాశంగా ఈ ఫంక్షన్ మారుతుంది కాబట్టి తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఎదో విధంగా ‘ఛల్ మోహన్ రంగ’ ఫంక్షన్ కు పవన్ ను రప్పించే విధంగా తన ఒత్తిడిని పెంచుతున్నాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: