ముందు నో చెప్పినా..తర్వాత ఓకే అన్న చరణ్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గత సంవత్సరం ‘ధృవ’ లాంటి బ్లాక్ బస్టర్ తో అభిమానులను అలరించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ పెద్దగా రావడం లేదు.  అయితే ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానని చెప్పినా కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటికి పోస్ట్ పోన్ చేశారు. 

ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళితో ఓ సినిమాలో నటించనున్న వార్తలు వచ్చాయి.  చరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.  వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన కథ రాంచరణ్ కి ఎప్పుడో వినిపించినా..ఆ  కథ పట్ల   అంతగా ఆసక్తిని చూపించలేదట.  దాంతో ఆ కథ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయడానికి ప్రయత్నించాడట..కానీ అదీ కూదరలలేదు. అదే సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో బెల్లంకొండ శ్రీనివాస్  'జయ జానకి నాయక' తీసి మంచి విజయం అందుకున్నాడు. 

మెగా అబ్బాయితో సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి చరణ్ కి మరోసారి వినిపించాట. బాగుందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. అలా ముందుగా తాను వద్దనుకున్న కథనే మళ్లీ చేయడానికి చరణ్ అంగీకరించాడని అంటున్నారు. మొత్తానికి బోయపాటి ఆ స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడని చెప్పుకుంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: