రాజమౌళి సినిమా తర్వాత అతి పెద్ద సెన్సేషన్ ప్రాజెక్ట్ చేయబోతున్న ఎన్టీఆర్..?
మాస్ ఆడియన్స్ కి విపరీతంగా ఈ సినిమా నచ్చింది. ఇటువంటి క్రమంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ వారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కోసం చర్చకు రాగా వారు తారక్ “కేజీఎఫ్” చిత్రాన్ని చూసి బాగా నచ్చిందని అందువల్ల ప్రశాంత్ తో ఒక సినిమా చేద్దామని అడిగారని తెలిపారు..దీనికి ప్రశాంత్ నీల్ కూడా అంగీకరించినట్టుగా తెలిపారని ఈ భారీ సెన్సేషన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆఖరులో మొదలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. అయితే ఈ సినిమా రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత ఉంటుందని ఫిలింనగర్ టాక్.