‘స్పిరిట్’ సెట్స్‌లో మంటలు.. ప్రభాస్ సేఫ్‌నా? ఫ్యాన్స్ ఆందోళన!

Amruth kumar
ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ పేరు వినబడితే చాలు రికార్డులు వణికిపోతున్నాయి. మరి అలాంటి ప్రభాస్.. ‘యానిమల్’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అయితే, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్‌లో ఒక ఊహించని అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది.



షూటింగ్ సెట్‌లో మంటలు - ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్!

హైదరాబాద్‌లో జరుగుతున్న ‘స్పిరిట్’ షూటింగ్ సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెట్‌లోని కొన్ని టెంట్లు, షూటింగ్ మెటీరియల్ పాక్షికంగా దగ్ధమయ్యాయి. దురదృష్టవశాత్తు చిత్ర బృందానికి చెందిన ఒక సభ్యుడికి స్వల్ప గాయాలయ్యాయి, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ లేని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తోంది.



థియేటర్లో ప్రభాస్, వంగా రచ్చ - ఫోటోలు వైరల్!

ఒకపక్క సెట్‌లో ప్రమాదం జరిగినా, ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా తమ మధ్య ఉన్న బాండింగ్‌ను మరోసారి చాటుకున్నారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను వీక్షించారు. థియేటర్ నుండి బయటకు వస్తున్న వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో "స్పిరిట్ కాంబో" పేరుతో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి సినిమా చూడటం చూస్తుంటే, ‘స్పిరిట్’ కోసం వీరు ఎంతటి పక్కా ప్లానింగ్‌తో ఉన్నారో అర్థమవుతోంది.



దసరాకు ‘ఫౌజీ’.. 2027లో ‘స్పిరిట్’ విధ్వంసం!

ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న యుద్ధ ప్రాతిపదికన రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చి ప్రభాస్ మార్క్ మేజిక్ చూపించబోతోంది. ఇక దీని తర్వాత ప్రభాస్ తన పూర్తి డేట్స్ ‘స్పిరిట్’ కోసం కేటాయించనున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ పోలీస్ యాక్షన్ డ్రామా 2027 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: