అందుకే అవకాశాలు తగ్గాయేమో.. హీరోయిన్ ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నప్పటికీ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత తనకి మంచి అవకాశాలు వస్తాయనుకున్న. ముఖ్యంగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తాయని ఆశించాను, కానీ అలా జరగలేదు.. టాలీవుడ్ లో ఇప్పుడొస్తున్న హీరోయిన్ పాత్రలు తాను చేయగలరా? అనే డౌటు అటు డైరెక్టర్లలో హీరోలలో ఉందేమో అందుకే తనకి అవకాశాలు తగ్గిపోయాయని తెలియజేసింది.
ప్రస్తుతం తనకు వస్తున్న అవకాశాలతో తాను సంతోషంగానే పాత్రలలో నటిస్తున్నానని వెల్లడించింది. అలాగే తాను నటించిన కాకా ముట్టై చిత్రంలో తాను ఇతర పిల్లల తల్లిగా కూడా నటించాను ఆ సమయంలో తన వయసు కేవలం 20 ఏళ్ల అని ఇప్పటివరకు నటిగా తను చేసిన పాత్రలన్నీ కూడా తనకి గౌరవాన్ని పెంచేలా చేశాయి అంటూ తెలియజేసింది. ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే పలు రకాల ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది ఐశ్వర్య రాజేష్. మరి రాబోయే రోజుల్లోనైనా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి.