చాలా కలాం తరువాత రవితేజ అలాంటి పని.. ఇక ఫ్యాన్స్ రచ్చ రంబోలానే..!

Thota Jaya Madhuri
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం..‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ . ఈ సినిమా పై బోలెడు అన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. మేకర్స్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుండి రెండో సింగిల్ ‘అద్దం ముందు’ పాటను డిసెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందన అందుకున్న నేపథ్యంలో, ఈ కొత్త పాటపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ప్రత్యేకంగా, ఈ పాటలో రవితేజ తీసుకున్న స్టెప్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని టీమ్ చెబుతోంది.

 

‘ఇడియట్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ను అలరించేలా, రవితేజ మార్క్ ఎనర్జీతో తెరకెక్కిందని సమాచారం. అప్పట్లో ఆ పాట ఎంత హంగామా క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాబట్టే మరోసారి అలాంటి స్టెప్స్ వస్తున్నాయన్న మాట బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు.ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిగా కామెడీ, ఎంటర్టైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీవ్వ్ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి హై ప్రొడక్షన్ విలువ్స్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.



ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో మ్యూజిక్ ప్రమోషన్‌కి మంచి ఆరంభం లభించింది. దాంతో ఇప్పుడు రెండో సింగిల్ అప్‌డేట్ విడుదల చేసి, మేకర్స్ మరింత హైప్ పెంచారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. చూడాలి మరి రవితేజ ఈసారి అయిన ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: