ఆమె వల్లే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్ప..జయాబచ్చన్ షాకింగ్ కామెంట్స్..!

Divya
బాలీవుడ్లో బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించిన అమితా బచ్చన్ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు..అమితాబచ్చన్ భార్యగా, నటి గా, రాజకీయ నాయకురాలిగా జయా బచ్చన్ పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే.. ఎలాంటి విషయాలలోనైనా నిర్మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయా బచ్చన్ తన సినీ ప్రస్థానం మరియు సుదీర్ఘ విరామం గురించి అసలు నిజాన్ని బయటపెట్టింది. 1971లో అమితా బచ్చన్ తో వివాహం తర్వాత సినిమాలను తగ్గించింది జయా బచ్చన్. 1981లో వచ్చిన సిల్సిలా సినిమా తర్వాత 14 ఏళ్ల ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.


ఈ విరామానికి అసలు కారణం తన కూతురు శ్వేత బచ్చన్ కారణమంటూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జయా బచ్చన్ మాట్లాడుతూ ఒకరోజు నేను షూటింగ్ కి సిద్ధమవుతున్న సమయంలో ఇంట్లోనే మేకప్ వేసుకుంటున్నాను ఆ సమయంలో నా దగ్గరికి వచ్చిన శ్వేత ఏం చేస్తున్నావని అడిగింది? నేను పనికి వెళుతున్నాను అని చెప్పగానే ఆమె అమాయకంగా చూస్తూ అమ్మ నువ్వు వెళ్లొద్దు నాన్నను మాత్రమే వెళ్ళమని చెప్పు అంటూ అడిగింది.. ఆ సమయంలో ఇంట్లో ఎంతమంది ఉన్న తల్లి లేని వెలితి తన కూతురులో గమనించానని ఆ మాటతో సినిమాలకు దూరమయ్యానని తెలిపింది.



అలాగే తన రీఎంట్రీ విషయం పైన జయా బచ్చన్ మాట్లాడుతూ శ్వేత వివాహం తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాను, ఏదో కోల్పోతున్నాననే బాధ చాలాసార్లు బాధ కలిగించిందని, ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మళ్లీ తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టానంటూ తెలిపింది. అలా 1995లో డాటర్స్ ఆఫ్  ది సెంచరీ చిత్రంతో రీ ఎంట్రీ మొదలయ్యిందని ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి (2023) వరకు తన సినీ కెరియర్ కొనసాగింది అంటూ తెలియజేసింది. స్టార్ సెలబ్రిటీగా ఉన్న సమయంలో తన కూతురు సంతోషం కోసం తన కెరీయర్ని త్యాగం చేసింది జయా బచ్చన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: