"రోజంతా ఉపవాసం..రాత్రికి ఆ పని".. శ్రావణమాసం వేళ టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్..!
మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా శ్రావణమాసాన్ని స్పెషల్ గా పూజించుకుంటూ ఉంటారు . కాగా రీసెంట్ గా ఒక హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఆ హీరోయిన్ పై ఇప్పటివరకు ఉన్న పాజిటివిటీ మొత్తం నెగిటివిటీగా మారిపోయింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది . చాలామంది రోజంతా ఉపవాసం పాటించాలి అనుకుంటారు. కొంతమంది సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు.
అయితే ఈ హీరోయిన్ కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటించారు . ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేసానని తన పోస్టులు పేర్కొంది . పైగా కొట్టు నుండి తెచ్చుకున్న మటన్ ను కూడా చూపించింది. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది . చాలామంది ఈ బ్యూటీ పై మండిపడుతున్నారు . శ్రావణమాసంలో మటన్ తినడం ఏమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ లాగించడమేంటి అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది ఆమెపై బూతులు వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..? తను మరెవరో కాదు "ఆషిక్ బనాయా అప్నే" సాంగ్ తో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్త . బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో నటించిందే ఆమె ఈ తను శ్రీ దత్త . ఆమెను ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!